తెలంగాణ

telangana

ఉపాధ్యక్షుడి కాన్వాయ్​పై బాంబు దాడి- 10 మంది మృతి

By

Published : Sep 9, 2020, 1:14 PM IST

అఫ్గాన్ ఉపాధ్యక్షుడి కాన్వాయ్​పై ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో ఆయన స్వల్ప గాయాలతో బయటపడ్డారు. 10 మంది పౌరులు మృతి చెందగా... పలువురికి గాయాలయ్యాయి.

10 killed, 12 injured after blast targets Afghan Vice President's convoy in Kabul
ఉపాధ్యక్షుడి కాన్వాయ్​పై బాంబు దాడి.. 10 మంది మృతి

అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్​లో ఆ దేశ ఉపాధ్యక్షుడు అమరుల్లా సలే​ లక్ష్యంగా ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో 10 మంది పౌరులు మృతి చెందారు. మరి కొందరు తీవ్రంగా గాయపడ్డారు. సలే​ స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డట్లు నిఘా అధికారి ఒకరు వెల్లడించారు.

చేతికి కట్టుతో...

అనంతరం చేతికి చిన్నకట్టుతో ఓ టీవీలో ఇంటర్వ్యూ ఇచ్చిన సలే​... తాను, తన చిన్న కుమారుడు క్షేమంగా ఉన్నట్లు చెప్పారు. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయినవారికి సంతాపం తెలిపారు.

ఈ దుశ్చర్యకు బాధ్యులు ఎవరో ఇప్పటికీ తెలియలేదు. ఈ దాడి తమ పని కాదని తాలిబన్లు ప్రకటించారు.

ఉపాధ్యక్షుడి కాన్వాయ్​పై బాంబు దాడి.. 10 మంది మృతి

భారత్​ స్పందన

బాంబు దాడిని భారత్ ఖండించింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. ఉగ్రవాదం నిర్మూలన, శాంతి స్థాపన కోసం అఫ్గానిస్థాన్​కు పూర్తి అండగా ఉంటామంటూ భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.

ఇదీ చూడండి:ఆ నగరంలో తుపాకీ సంస్కృతికి 10 మంది బలి

ABOUT THE AUTHOR

...view details