తెలంగాణ

telangana

ETV Bharat / international

ఇరాన్​పై ఆంక్షలకు సిద్ధం- దాడులపై తర్జనభర్జన

ఇరాన్​పై మరిన్ని ఆంక్షలను విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ ప్రకటించారు. సైనిక చర్య చేపట్టే అంశాన్నీ పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. అణ్వస్త్ర కార్యక్రమానికి స్వస్తి పలకాల్సిందేనని ఇరాన్​ను హెచ్చరించారు.

By

Published : Jun 23, 2019, 11:30 AM IST

Updated : Jun 23, 2019, 1:02 PM IST

ఇరాన్​పై మరిని ఆంక్షలు విధిస్తాం: ట్రంప్

ఇరాన్​పై ఆంక్షలకు సిద్ధం- దాడులపై తర్జనభర్జన

ఇరాన్​పై మరిన్ని ఆంక్షలు విధిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ తాజాగా ప్రకటించారు. ఈ కీలక ఆంక్షలు సోమవారం అమల్లోకి రానున్నాయి. అణ్వస్త్ర కార్యక్రమానికి స్వస్తి పలికితే ఇరాన్​కు తాను మంచి స్నేహితుడిగా ఉంటానన్న కొన్ని గంటలకే నూతన ఆంక్షలను ప్రకటించారు ట్రంప్.

"సోమవారం ఇరాన్​పై అదనపు ఆంక్షలు విధించనున్నాము. ఆంక్షల నుంచి ఇరాన్ బయటపడే రోజు కోసం ఎదురుచూస్తున్నా. అప్పుడు ఆ దేశం మళ్లీ సుసంపన్నంగా మారుతుంది. ఇది ఎంత త్వరగా జరిగితే అంత మంచిది."- డొనాల్డ్ ట్రంప్​, అమెరికా అధ్యక్షుడు

సైనిక చర్య...

తమ గగనతలంలోకి అక్రమ చొరబడిందనే నెపంతో అమెరికా నిఘా డ్రోన్​ను ఇరాన్ కూల్చివేసినప్పటి నుంచి ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఈ విషయంపై మండిపడ్డ ట్రంప్​... ఇరాన్​పై సైనిక చర్య చేపట్టే అంశాన్ని ఇంకా పరిశీలిస్తూనే ఉన్నామని తెలిపారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు ఈ అంశం తమ ప్రాధాన్యాంశాల్లో ఉంటుందని హెచ్చరించారు.

150 మంది ఇరాన్​ ప్రజలు ప్రాణాలు కోల్పోతారనే కారణంగానే గురువారం చేపట్టాలని భావించిన సైనిక చర్యను నిలిపివేశానని ట్రంప్ తెలిపారు.

"150 మంది ఇరాన్ ప్రజలను చంపాలని నేను కోరుకోవడం లేదు. అవసరమైతే తప్ప ఎవరినీ చంపడానికి నేను ఇష్టపడను." -డొనాల్డ్​ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు

ఇరాన్​ నిరసన..

30 మంది ప్రయాణిస్తున్న యూఎస్​ నిఘా విమానాన్ని కూల్చకూడదని ఇరాన్ సైన్యం తీసుకన్న నిర్ణయాన్ని అభినందనిస్తున్నట్టు ట్రంప్ వెల్లడించారు. అయితే తమ నిఘా డ్రోన్ అంతర్జాతీయ గగనతలంలో ఉన్నప్పుడే ఇరాన్ కూల్చివేసిందని ట్రంప్ పునరుద్ఘాటించారు.

అమెరికా డ్రోన్​లను ప్రయోగించడానికి అనుమతించాలని నిర్ణయం తీసకున్న పొరుగు అరబ్​ దేశంపై ఇరాన్​ ఆగ్రహం వ్యక్తం చేసింది. యూఏఈ ప్రతినిధిని టెహ్రాన్​కు పిలిపించి నిరసన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఇరాన్​పై సైనిక చర్య అంశాన్ని ట్రంప్ లేవనెత్తారు.

ఇరాన్​ దూకుడుగా వ్యవహరిస్తుండటం వల్ల యుద్ధం జరిగే అవకాశముందని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి.

ఇదీ చూడండి: ఇరాన్ నిఘా కేంద్రాల​పై అమెరికా సైబర్​ దాడి

Last Updated : Jun 23, 2019, 1:02 PM IST

ABOUT THE AUTHOR

...view details