తెలంగాణ

telangana

ETV Bharat / international

'సీఏఏ, ఎన్​ఆర్​సీలపై మోదీతో ట్రంప్​ చర్చిస్తారు'

భారత పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మతపరమైన స్వేచ్ఛపై అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ చర్చిస్తారని పేర్కొంది అమెరికా. ట్రంప్​.. భారత పర్యటన ఇరు దేశాల మధ్య బలమైన బంధాన్ని సూచిస్తుందని స్పష్టం చేసింది.

Trump will raise issue of religious freedom with Modi: White House
'సీఏఏ, ఎన్​ఆర్​సీలపై మోదీతో ట్రంప్​ చర్చిస్తారు'

By

Published : Feb 22, 2020, 11:10 AM IST

Updated : Mar 2, 2020, 4:01 AM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​.. భారత పర్యటన ప్రపంచంలోని రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య బలమైన, నిరంతర బంధాన్ని సూచిస్తుందని పేర్కొంది శ్వేతసౌధం. ఈ పర్యటన ప్రధాని నరేంద్ర మోదీ, అధ్యక్షుడు ట్రంప్​ మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలకు నిదర్శనగా అభివర్ణించింది.

ఈనెల 24, 25 తేదీల్లో భారత్​లో పర్యటించనున్నారు ట్రంప్​. మెలానియా ట్రంప్​తో కలిసి అహ్మదాబాద్​, ఆగ్రా, దిల్లీని సందర్శించనున్నారు. ట్రంప్​తో పాటు 12 మంది ఉన్నత స్థాయి అధికారుల బృందం భారత్​కు రానుంది.

మతపరమైన స్వేచ్ఛపై...

భారత పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో మతపరమైన స్వేచ్ఛపై అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ చర్చిస్తారని పేర్కొంది శ్వేతసౌధం. భారత ప్రజాస్వామ్య సంప్రదాయాలు, సంస్థలను అమెరికా గౌరవిస్తుందని తెలిపింది.

పౌరసత్వ చట్ట సవరణ, జాతీయ పౌర జాబితాలపై మోదీతో ట్రంప్​ మాట్లాడే అవకాశం ఉందా అని అడిగిన ప్రశ్నకు శ్వేతసౌధం అధికారి ఒకరు ఈ విధంగా సమాధానమిచ్చారు. సీఏఏ, ఎన్​ఆర్​సీల అంశంలో ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: నమస్తే ట్రంప్​: 'మోటేరా' విశేషాలు ఎన్నో.. మరెన్నో!

Last Updated : Mar 2, 2020, 4:01 AM IST

ABOUT THE AUTHOR

...view details