తెలంగాణ

telangana

ETV Bharat / international

మోదీకి ట్రంప్ శుభాకాంక్షలు.. కలిసి పనిచేయాలని ఆకాంక్ష

సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి ఘనవిజయం సాధించిన భారత ప్రధాని నరేంద్ర మోదీకి దేశాధినేతలు, ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్​.. మోదీకి అభినందనలు తెలుపుతూ దౌత్య సంబంధాల మెరుగుకు కృషి చేయాలని ట్వీట్​ చేశారు. అనంతరం మోదీ అందరికీ ధన్యవాదాలు తెలిపారు.

By

Published : May 24, 2019, 6:51 AM IST

మోదీ- ట్రంప్

మోదీకి అభినందనలు తెలిపిన దేశాధినేతలు

2019 సార్వత్రిక ఎన్నికల్లో ఘనవిజయం సాధించి.. మరోసారి ప్రధాని కానున్న నరేంద్ర మోదీకి ప్రపంచదేశాల నేతలు శుభాకాంక్షలు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​​ ట్రంప్, ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ తదితరులు ట్విట్టర్​లో మోదీకి అభినందనలు తెలిపారు. ప్రముఖుల ట్వీట్లకు స్పందించిన మోదీ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

'ప్రధానిగా మరోసారి ప్రమాణస్వీకారం చేయనున్న మీకు(నరేంద్ర మోదీ) శుభాకాంక్షలు. అమెరికా - భారత్​ మధ్య దౌత్య సంబంధాలు మెరుగుపరిచేందుకు కృషిచేయాలి. భవిష్యత్తులో ఇరు దేశాలు కలిసి పనిచేయాలని కోరుకుంటున్నా'
- డొనాల్డ్ ట్రంప్​, అమెరికా అధ్యక్షుడు.

ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్​ ప్రధాని మోదీకి అభినందనలు తెలిపారని ఐరాస ప్రతినిధి ఒకరు ట్వీట్ చేశారు.

'మేము ఫలితాలను ముందు నుంచీ పరిశీలిస్తూనే ఉన్నాం. ప్రధాని మోదీ దూసుకెళ్లారు. వాతావరణ మార్పుల అంశంపై ఆంటోనియో గుటెరస్​, మోదీకి సత్సంబంధాలున్నాయి. రాబోయే రోజుల్లో ఇలాగే కలిసి పనిచేయాలనుకుంటున్నాం'
- ఐరాస ప్రతినిధి

తనకు శుభాకాంక్షలు తెలిపిన దేశాధినేతలకు, ప్రముఖులకు ధన్యవాదాలు తెలిపారు మోదీ. ఇందులో అఫ్గానిస్థాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ, శ్రీలంక ప్రధాని రనిల్​ విక్రమ్ సింఘేలున్నారు.

అదేవిధంగా భారతీయ ప్రముఖులు సచిన్ తెందూల్కర్​, అక్షయ్​కుమార్, రజనీకాంత్, ఆశాభోంస్లేలకు ధన్యవాదాలు తెలిపారు. గురువారం జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి స్పష్టమైన మెజార్టీతో విజయం సాధించింది.

ABOUT THE AUTHOR

...view details