తెలంగాణ

telangana

ETV Bharat / international

రోబో గీసిన చిత్రాలకు రూ.8కోట్లు!

మానవులకు మాత్రమే సాధ్యమనుకున్న చిత్రలేఖన కళను అద్భుతంగా ప్రదర్శిస్తోంది ఓ రోబో. ఈ మరమనిషి తొలిసారి గీసిన చిత్రాలు ఏకంగా రూ.8కోట్లకు అమ్మడవటం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

By

Published : Jun 30, 2019, 5:22 AM IST

రోబో గీసిన చిత్రాలకు రూ.8కోట్లు!

రోబో గీసిన చిత్రాలకు రూ.8కోట్లు!

రోబోలు చాలా రకాల పనులు చేయడం ఇటీవలి కాలంలో చూస్తూనే ఉన్నాం. కానీ మానవులకు మాత్రమే సాధ్యమైన అద్భుతమైన చిత్ర కళను ప్రదర్శిస్తోంది ఓ మర మనిషి. ఈ రోబో చిత్రలేఖనం నైపుణ్యాన్ని చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు.

19 వ శతాబ్దం నాటి తొలి కంప్యూటర్ ప్రోగ్రామర్ అడా లవలేస్ పేరును సార్థకం చేసేలా ఈ రోబోను ఐడాగా పిలుస్తున్నారు. ఈ మర మనిషి గీసిన చిత్రాలతో ఓ ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనలో ఐడా చిత్రాలకు వచ్చిన డబ్బెంతో తెలుసా అక్షరాలా 1.27 మిలియన్ అమెరికన్ డాలర్లు... భారత కరెన్సీలో రూ. 8 కోట్లు. ఈ ప్రదర్శన జులై 6 వరకు కొనసాగనుంది.

ఐడాను కృత్రిమ మేధస్సు గల తొలి అల్ట్రా రియాలిస్టిక్ రోబోగా చెప్తున్నారు.

"ఐడా మనిషిని చూడగలదు. కళ్లల్లోని కెమెరాలతో మనిషి చిత్రాన్ని నిక్షిప్తం చేసుకుంటుంది. సాంకేతికత సహాయంతో చిత్రాన్ని విశ్లేషించుకుంటుంది. అనంతరం బొమ్మలను గీస్తుంది."

-ఐడెన్ మెల్లర్, చిత్ర ప్రదర్శన నిర్వాహకుడు

తన ముందు నిల్చున్న వారి చిత్రాలను ఆల్గారిథమ్స్ సహాయంతో విశ్లేషించి గీయడమే కాదండోయ్... ఇంజినీర్లూ నిక్షిప్తం చేసిన బొమ్మలనూ చక్కగా గీస్తోంది.
ఐడా చేతికున్న పెన్సిల్ 5వందల ఏళ్ల నాటి కలపలోనిది. ఈ కలపను ఉపయోగించి తయారుచేసిన పెన్సిల్​నే ప్రఖ్యాత చిత్రకారుడు లియోనార్డో డావిన్సీ ఉపయోగించేవారు.

ఈ రోబోను ఆక్స్​ఫర్డ్ విశ్వవిద్యాలయం నిపుణులు రూపొందించారు.

ఇదీ చూడండి: సీఎంకు ట్రాఫిక్​ చలానా- 4 నెలలుగా పెండింగ్

ABOUT THE AUTHOR

...view details