తెలంగాణ

telangana

By

Published : Feb 11, 2022, 9:53 AM IST

ETV Bharat / international

లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. 20 మంది దుర్మరణం

Peru bus accident: పెరూలో ఓ బస్సు లోయలో పడిన ఘటనలో 20 మంది దుర్మరణం చెందారు. మరో 33 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు.

Peru bus accident
Peru bus accident

Peru bus accident: పెరూలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ బస్సు లోయలో పడి 20 మంది మృతి చెందారు. మరో 33 మంది క్షతగాత్రులయ్యారు. ఉత్తర పెరూలోని పటాజ్​ రాష్ట్రంలో ఈ దుర్ఘటన జరిగింది.

తయబంబా నుంచి ట్రుజిల్లోకు వెళ్తున్న బస్సు.. లిబర్టాడ్​ ప్రాంతంలో అదుపుతప్పి లోయలో పడిపోయింది. 100 మీటర్ల లోతు లోయలో పడిపోవడం వల్ల బస్సు నుజ్జునజ్జు అయింది. దీంతో 20 మంది అక్కడికక్కడే మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సామాన్య ప్రజలు సైతం ఈ సహాయక చర్యల్లో పాల్గొని.. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను వెలికితీసిన అధికారులు.. పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి:'ఉక్రెయిన్ నుంచి వచ్చేయండి.. సైన్యాన్ని పంపిస్తే ప్రపంచ యుద్ధమే!'

ABOUT THE AUTHOR

...view details