తెలంగాణ

telangana

డోరైన్​ తుపానుకు బహమాస్​ అతలాకుతలం

డోరైన్​ తుపానుకు బహమాస్​ అతలాకుతలమవుతోంది. ఇప్పటి వరకు ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ తమ నివాసాలను విడిచి బయటకు రాకూడదని అధికారులు హెచ్చరించారు.

By

Published : Sep 3, 2019, 5:10 AM IST

Published : Sep 3, 2019, 5:10 AM IST

Updated : Sep 29, 2019, 6:06 AM IST

డోరైన్​ తుపానుకు బహమాస్​ అతలాకుతలం

డోరైన్​ తుపానుకు బహమాస్​ అతలాకుతలం

కరీబియన్​ దేశం బహమాస్​లో డోరైన్​ తుపాను బీభత్సం సృష్టిస్తోంది. తుపాను ధాటికి జనజీవనం స్తంభించింది. బలమైన ఈదురు గాలులకు ప్రజలు విలవిలలాడుతున్నారు. తుపాను వల్ల ఇప్పటి వరకు ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. విపత్తు వల్ల 13వేల నివాసాలు ధ్వంసమయ్యాయి. అబాకో ద్వీపంలో వరదలకు తాగు నీరు కలుషితమైంది.

విపత్తు తీవ్రత అధికంగా ఉండటం వల్ల సహాయక చర్యలు నిలిచిపోయాయి. వరదల వల్ల అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. తుపాను నుంచి రక్షించమని ఓ రేడియో స్టేషన్​కు 2వేల సందేశాలు అందాయి.

డోరైన్​ తుపాను నేపథ్యంలో ప్రజలు తమ నివాసాలను విడిచి బయటకు రాకూడదని అధికారులు ఆదేశించారు. తుపాను తీవ్రత తగ్గే వరకు సహాయక చర్యలు చేపట్టలేమని స్పష్టం చేశారు.

డోరైన్​ ధాటికి 7 మీటర్ల వరకు గాలివాన ఏర్పడే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని బహమాస్​ దేశస్థులు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు.

మరోవైపు డోరైన్​ తుపాను మంగళవారం అమెరికాలోని ఫ్లోరిడా తీరప్రాంతంవైపు ప్రయాణించే అవకాశముంది. నిరంతరం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు.

ఇదీ చూడండి:- అంతరిక్షంలోనూ యుద్ధానికి అమెరికా సిద్ధం!

Last Updated : Sep 29, 2019, 6:06 AM IST

ABOUT THE AUTHOR

...view details