తెలంగాణ

telangana

ETV Bharat / international

విద్యకు నిధుల కోత.. విద్యార్థుల నిరసన బాట

బ్రెజిల్​లో విద్యార్థిలోకం నిరసన బాట పట్టింది. ప్రభుత్వం బడ్జెట్​లో విద్యారంగానికి 30శాతం నిధుల కోత విధించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పలు చోట్ల నిరసనకారులపై పోలీసులు బాష్పవాయువు ప్రయోగించడం హింసకు దారి తీసింది.

By

Published : May 16, 2019, 10:10 AM IST

విద్యకు నిధుల కోత.. విద్యార్థుల నిరసన బాట

బ్రెజిల్​వ్యాప్తంగా విద్యార్థులు ఆందోళనలు చేపట్టారు. బడ్జెట్​లో విద్యారంగానికి 30 శాతం(1.85 బిలియన్​ డాలర్లు) కోత విధించడంపై నిరసనకు దిగారు. అన్ని నగరాల్లో రోడ్లపై భారీ ర్యాలీలు నిర్వహించారు. అధ్యక్షుడు జేర్​ బాల్సొనారోకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

రియో డి జెనిరోలో నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసిన ఆందోళనకారులు బస్సుకు నిప్పంటించారు. ఫలితంగా కాసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

నిరసనకారులపై అధ్యక్షుడి తీవ్ర విమర్శలు

"నిరసనకారులు బుద్ధిహీనులు" అని అన్నారు బ్రెజిల్ అధ్యక్షుడు జేర్​ బాల్సొనారో. ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని బడ్జెట్​ కోతను సమర్థించుకున్నారు.

విద్యకు నిధుల కోత.. విద్యార్థుల నిరసన బాట

ఇదీ చూడండి: పారిస్​: హ్యాపీ బర్త్​ డే టు 'ఈఫిల్​ టవర్​'

ABOUT THE AUTHOR

...view details