తెలంగాణ

telangana

ETV Bharat / international

మద్దతు ధర కోసం ఉచితంగా పండ్ల పంపిణీ

పంటలకు మద్దతు ధర కల్పించాలంటూ అర్జెంటీనా పండ్ల రైతులు వినూత్నంగా నిరసన తెలిపారు. రాజధాని బ్యూనస్​ ఎయిర్స్​లోని ప్రభుత్వం భవనం ఎదుట వందల కిలోల పండ్లను ఉచితంగా పంచారు.

By

Published : Apr 24, 2019, 12:41 PM IST

మద్దతు ధర కోసం ఉచితంగా పండ్ల పంపిణీ

మద్దతు ధర కోసం ఉచితంగా పండ్ల పంపిణీ

పండ్ల ఉత్పత్తులకు మద్దతు ధర కల్పించాలంటూ అర్జెంటీనాలో రైతులు దేశ రాజధానిలో నిరసన చేపట్టారు. బ్యూనస్​ ఎయిర్స్​లోని ప్రభుత్వ ప్రధాన కార్యాలయం​ ఎదుట ప్రజలకు పియర్స్​, యాపిల్​, నారింజ పండ్లను ఉచితంగా పంచి నిరసన తెలిపారు.

పండ్ల రైతుల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, ప్రత్యేక రాయితీలు కల్పించి ఆదుకోవాలని వారు కోరుతున్నారు. ముఖ్యమైన ఉత్పత్తుల దిగుమతులను తగ్గించి, పన్ను రాయితీలను కల్పించాలని అధ్యక్షుడు మరిసియో మాక్రిని అభ్యర్థించారు.

ఉత్పత్తి వ్యయం తగ్గించేందుకు తక్కువ వడ్డీకే రుణాలు మంజూరు చేయాలంటున్నారు రైతులు. ధరల అంతరాల్ని రూపుమాపాలని కోరారు. రియో నీగ్రో, న్యూక్వెన్, ఎంటర్​ రియో రాష్ట్రాల పండ్ల రైతులు ఈ నిరసనల్లో పాల్గొన్నారు.

ఇదీ చూడండి: ట్రంప్​ ఐటీ రిటర్నుల కోసం కోర్టుకు కాంగ్రెస్!

ABOUT THE AUTHOR

...view details