తెలంగాణ

telangana

ETV Bharat / international

పిల్లిని కూడా 'మమ్మీ'ని చేసిన ఘనత వారిది!

ఈజిప్టు​లో అత్యంత పురాతన జంతువుల అవశేషాలు బయటపడ్డాయి. సింహం, పిల్లి, మొసలి సహా పలు జంతువుల శిలాజాలను గుర్తించినట్లు ఈజిప్ట్ పురావస్తు శాఖ వెల్లడించింది. రాతి రూపంలోని భారీ కీటకాలను సైతం గుర్తించామని తెలిపింది.

By

Published : Nov 24, 2019, 1:13 PM IST

ఈజిప్టు తవ్వకాల్లో బయటపడిన జంతువుల 'మమ్మీ'లు

తవ్వకాల్లో పురావస్తు శాఖ వెలికితీసిన మమ్మీలు

ఈజిప్టు తవ్వకాల్లో ఇటీవల బయటపడిన జంతువుల అవశేషాల వివరాలను ఆ దేశ పురావస్తు శాఖ వెల్లడించింది. పిల్లులు, పక్షులు, మొసళ్లు సహా అయిదు సింహం పిల్లల శిలాజాలను తవ్వకాల్లో గుర్తించినట్లు తెలిపింది.

ఈ అవశేషాలు లభించిన నెక్రోపోలిస్​కు సమీపంలోని దక్షిణ కైరో, సక్కారాలోని స్టెప్ పిరమిడ్​లో జంతువుల మమ్మీలను భద్రపరిచినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో పిల్లుల అవశేషాలను ఎక్కువ సంఖ్యలో గుర్తించినప్పటికీ.. సింహాల శిలాజాలు గుర్తించడం చాలా అరుదైన విషయమని పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీటితో పాటు రాతి రూపంలో ఉన్న పేడపురుగు, మరో కీటక అవశేషాలను గుర్తించారు. తవ్వకాల్లో ఇప్పటివరకు లభించిన వాటిలో ఇవే అతి పెద్దవని తెలిపారు.

ఈ జంతు మమ్మీలన్నీ చాలా పురాతనమైనవని ఈజిప్టు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇవి క్రీస్తు పూర్వం 664-332 సంవత్సరానికి చెందినవని స్పష్టం చేసింది.

ఇదీ చూడండి: 'వాలంటైన్స్​ డే' కానుకగా విజయ్ కొత్త సినిమా!

ABOUT THE AUTHOR

...view details