ఉత్తర నైజీరియాలోని కట్సినా రాష్ట్రంలోని పలు గ్రామాల్లో బందిపోట్లు మారణహోమం సృష్టించారు. ఈ దాడుల్లో 47 మంది మృతి చెందారు.
కట్సినాలోని దట్సేన్మా, డాన్ముసా, సఫానా జిల్లాల్లోని గ్రామాలపై ప్రణాళికాబద్ధంగా బందిపోట్లు విరుచుకుపడినట్లు తెలిపారు పోలీసులు. ద్విచక్రవాహనాలపై వచ్చి తుపాకులతో గ్రామస్థులను కాల్చి చంపినట్లు వెల్లడించారు.