తెలంగాణ

telangana

ETV Bharat / international

గ్రామాలపై బందిపోట్ల దాడులు- 47 మంది మృతి

నైజీరియాలో బందిపోట్లు చెలరేగిపోయారు. అనేక గ్రామాలపై ఒక్కసారిగా దాడి చేసి 47 మందిని బలిగొన్నారు.

By

Published : Apr 20, 2020, 12:51 PM IST

Bandits kill 47 people in north of Nigeria: police
బందిపోట్ల దాడిలో 47 మంది మృతి

ఉత్తర నైజీరియాలోని కట్సినా రాష్ట్రంలోని పలు గ్రామాల్లో బందిపోట్లు మారణహోమం సృష్టించారు. ఈ దాడుల్లో 47 మంది మృతి చెందారు.

కట్సినాలోని దట్సేన్మా, డాన్ముసా, సఫానా జిల్లాల్లోని గ్రామాలపై ప్రణాళికాబద్ధంగా బందిపోట్లు విరుచుకుపడినట్లు తెలిపారు పోలీసులు. ద్విచక్రవాహనాలపై వచ్చి తుపాకులతో గ్రామస్థులను కాల్చి చంపినట్లు వెల్లడించారు.

బందిపోట్ల దాడులు జరిగిన ప్రాంతాల్లో భారీ ఎత్తున భద్రతా దళాల్ని మోహరించింది నైజీరియా ప్రభుత్వం.

ఇదీ చదవండి:కరోనా పరీక్షల్లో భారత్​కు, అమెరికాకు ఇంత తేడానా?

ABOUT THE AUTHOR

...view details