తెలంగాణ

telangana

By

Published : Apr 7, 2022, 5:02 PM IST

ETV Bharat / entertainment

10న రవితేజ 'బుల్ బుల్ తరంగ్'.. ఆర్జీవీ 'డేంజరస్' వాయిదా

మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమా నుంచి సాలిడ్​ అప్డేట్​ను ఈ నెల 10న ఇవ్వనుంది చిత్ర బృందం. థియేటర్లు సహకరించకపోవడం వల్ల 'డేంజరస్' సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు రాంగోపాల్ వర్మ.

movie updates
మూవీ అప్డేట్స్​

bulbul tarang song: మాస్ మహారాజా రవితేజ హీరోగా శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ 'రామారావు ఆన్ డ్యూటీ'. సామ్ సీఎస్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి మొదటి పాటగా 'బుల్ బుల్ తరంగ్'​ను ఏప్రిల్ 10న రిలీజ్ చేయబోతోంది చిత్రబృందం. రవితేజ, రజిషా విజయన్ పై ఈ సాంగ్ ను చిత్రీకరించారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకుని రిలీజ్ కు రెడీ అవుతుంది.

రామారావు ఆన్ డ్యూటీ

dangerous release postponed: ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తన తాజా చిత్రం 'డేంజరస్' విడుదల వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని రేపు విడుదల చేసేందుకు సన్నాహాలు చేయగా.... థియేటర్లు ఆ చిత్రాన్ని ప్రదర్శించేందుకు నిరాకరించాయి. డేంజరస్ విడుదలకు థియేటర్లు సహకరించకపోవడం వల్ల సినిమా వాయిదా వేస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా వర్మ ప్రకటించారు. సినిమాను ఎలా ప్రేక్షకులకు చేరువ చేయాలో తెలుసని పేర్కొన్న వర్మ... త్వరలోనే మరో విడుదల తేదీని వెల్లడించనున్నట్లు తెలిపారు. స్వలింగ సంపర్కులైన ఇద్దరు అమ్మాయిల మధ్య ప్రేమను క్రైమ్ డ్రామాగా వర్మ డేంజరస్ ను రూపొందించారు. మరోవైపు ఈ చిత్ర విడుదల నిలిపివేయాలంటూ ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ సిటి సివిల్ కోర్టును ఆశ్రయించారు. నట్టికుమార్ పిటిషన్ ను పరిశీలించిన సిటీ సివిల్ కోర్టు.... ఖత్రా డేంజరస్ చిత్ర విడుదలపై స్టే ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

bahubali prabhakar new movie: మాజీ సైనికాధికారి జీవితంలో ఓ రాత్రి ఏం జరిగిందనే కథాంశంతో 'బాహుబలి' ప్రభాకర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న నూతన చిత్రం హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ దైవసన్నిదానంలో లాంఛనంగా ప్రారంభమైంది. ఆర్ఆర్ క్రియేషన్స్ పతాకంపై పాలిక్ దర్శకత్వంలో రావుల రమేష్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుల సంఘం అధ్యక్షుడు కాశి విశ్వనాథ్, తెలుగు నిర్మాతల మండలి గౌరవ కార్యదర్శి ప్రసన్నకుమార్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా సాగే ఈ సినిమాను గోవా, హైదరాబాద్, అరకు ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపనున్నట్లు చిత్ర దర్శకుడు పాలిక్ తెలిపారు. షకలక శంకర్, జీవా, చలపతిరావు, సుధలు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

ఇదీ చదవండి:హాట్​ ఫొటోలతో టెంపరేచర్​ పెంచేసిన అనసూయ.. తట్టుకోవడం కష్టమే!

ABOUT THE AUTHOR

...view details