తెలంగాణ

telangana

By

Published : Oct 28, 2022, 8:19 AM IST

ETV Bharat / entertainment

'వీరసింహారెడ్డి'గా బాలయ్య భారీ పోరాటం.. 'జైలర్​' రిలీజ్​ అప్పుడేనా?

హీరో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం 'వీరసింహారెడ్డి'. సంక్రాంతి సందర్భంగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో బాలయ్య.. విలన్​ గ్యాంగ్​కు మధ్య ఓ భారీ పోరాట ఘట్టాన్ని చిత్రీకరిస్తున్నారు. మరోవైపు, రజనీకాంత్​ నటిస్తున్న 'జైలర్‌' చిత్రం విడుదల తేదీపై చిత్రబృందం ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

balakrishna-veerasimhareddy-shooting-at-hyderabad-and-jailer-release-date
balakrishna-veerasimhareddy-shooting-at-hyderabad-and-jailer-release-date

Balakrishna Veerasimha Reddy Movie: సంక్రాంతి బరిలో సందడి చేసేందుకు సెట్స్‌పై శరవేగంగా ముస్తాబవుతోంది 'వీరసింహారెడ్డి' చిత్రం. బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని గోపీచంద్‌ మలినేని తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. శ్రుతిహాసన్‌ కథానాయిక. సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే మిగిలి ఉన్న చిత్రీకరణను చకచకా పూర్తి చేస్తోంది చిత్ర బృందం. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో గురువారం ఓ కీలక షెడ్యూల్‌ను ప్రారంభించారు.

ఇందులో భాగంగా బాలకృష్ణ.. విలన్‌ గ్యాంగ్‌కు మధ్య ఓ భారీ పోరాట ఘట్టాన్ని చిత్రీకరిస్తున్నారు. దీనికి వెంకట్‌ మాస్టర్‌ నేతృత్వం వహిస్తున్నారు. ఈ విషయాన్ని చిత్ర బృందం ప్రకటించింది. వాస్తవ సంఘటనల ఆధారంగా అల్లుకున్న మాస్‌ యాక్షన్‌ కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రమిది. ప్రతినాయకుడిగా దునియా విజయ్‌ నటిస్తున్నారు. వరలక్ష్మీ శరత్‌కుమార్‌, నవీన్‌ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంగీతం: తమన్‌, ఛాయాగ్రహణం: రిషి పంజాబీ.

Rajnikanth Jailer Movie: రజనీకాంత్‌ సినిమా వస్తోందంటే అభిమానులకు పండగే. ప్రస్తుతం ఆయన నటిస్తున్న 'జైలర్‌' చిత్రం వేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా విడుదల తేదీపై చిత్రబృందం ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. తమిళ సంవత్సరాది సందర్భంగా వచ్చే ఏడాది ఏప్రిల్‌ 14న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ఆలోచనలో చిత్రబృందం ఉన్నట్లు తమిళ సినీ వర్గాలు చెబుతున్నాయి.

వినోదం, థ్రిల్లింగ్‌ అంశాలతో పాటు రజనీ అభిమానులు కోరుకునే అన్ని అంశాలతో ఈ చిత్రం రూపొందుతోందని చిత్రబృందం చెబుతోంది. రమ్యకృష్ణ, శివరాజ్‌కుమార్‌ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తోన్న ఈ చిత్రంలో యువ కథానాయకుడు శివ కార్తికేయన్‌ అతిథి పాత్రలో మెరవనున్నాడు. ఆగస్టులో సెట్స్‌పైకి వెళ్లిన ఈ సినిమా చిత్రీకరణని 2023 ఆరంభంలో పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details