తెలంగాణ

telangana

By

Published : Apr 7, 2019, 3:13 PM IST

ETV Bharat / elections

భారత్​ భేరి: ఎన్నికల కోసం కిడ్నీ అమ్మకం!

ఎన్నికల్లో పోటీ కోసం ఆస్తులు అమ్ముకునే వారు ఎంతోమంది. అసోంకు చెందిన ఓ వ్యక్తి మాత్రం "అంతకుమించి" అంటున్నారు. ఎందుకలా?

సుకుర్ అలీ

ఎన్నికల్లో పోటీకి అలీ సిద్ధం!

అసోం రాష్ట్రంలోని మొదాటి గ్రామస్థుడు సుకుర్ అలీ. వయసు 26 ఏళ్లు. గ్రామ సమస్యలు తీర్చేందుకు డుబిడీ లోక్​సభ స్థానం నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ అందుకు అవసరమైన డబ్బు ఆయన దగ్గర లేదు. అందుకే విరాళాలు సేకరిస్తున్నారు.

"ఎన్నికల్లో పాల్గొనేందుకు డబ్బు సేకరించలేకపోతే కిడ్నీ అమ్ముకుంటా. ఈ ప్రాంతంలో అభివృద్ధి అనేదే లేదు. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నా."
-సుకుర్ అలీ, మొదాటి గ్రామస్థుడు

కొన్నేళ్ల క్రితం గ్రామంలో రాకపోకల నిమిత్తం షిబ్బాలి నదిపై చిన్న వంతెన నిర్మించాల్సి వచ్చింది. ఆ సమయంలో తన భూమిలోని కొంత భాగాన్ని అమ్మి నిధులు సమకూర్చారు అలీ. ప్రస్తుతం నిరుద్యోగిగా ఉన్నారు.

"బాల్యం నుంచి చూస్తున్నాను. వ్యక్తిగత అవసరాలకోసమే రాజకీయాల్లోకి వస్తున్నారు. పేదల అవసరాలు తీర్చడానికి మాత్రం ఎవరూ రావటం లేదు. ఈ సంప్రదాయాన్ని మార్చుతా. అందుకు కిడ్నీ అమ్ముకునేందుకూ వెనకాడను."
-సుకుర్ అలీ, మొదాటి గ్రామస్థుడు

మొదాటి గ్రామంలో నీటి సమస్య అధికంగా ఉందని అక్కడి స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో సరైన రవాణా సదుపాయాలు లేవని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

దిగ్గజంతో పోటీ

డుబిడీ నుంచి ఐక్య ప్రజాస్వామ్య కూటమి దిగ్గజ నేత మౌలానా బద్రుద్దీన్ అజ్మల్ బరిలో నిలిచారు. నియోజకవర్గంలో అజ్మల్​ ప్రాబల్యం అధికం. అయితే ప్రజాస్వామ్యంలో ఏదైనా సాధ్యమేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు అలీ.

అసోంలోని ఐదు లోక్​సభ స్థానాలకు ఏప్రిల్​ 11, 18, 23న మూడు దశల్లో పోలింగ్ జరగనుంది. ఫలితాలు మే 23న విడుదల అవుతాయి.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details