తెలంగాణ

telangana

By

Published : Feb 24, 2022, 9:09 AM IST

ETV Bharat / crime

భార్య కాపురానికి రావట్లేదని.. సెల్‌ టవర్‌ ఎక్కిన యువకుడి మృతి

Man Died: మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లలో విషాదం చోటు చేసుకుంది. జడ్చర్ల రైల్వే స్టేషన్‌ సమీపంలో సెల్‌ టవర్‌ ఎక్కిన యాదయ్య అనే వ్యక్తి ప్రమాదవశాత్తూ కిందపడి ప్రాణాలు కోల్పోయాడు. భార్య కాపురానికి రావడంలేదని మనస్తాపంతో టవర్‌ ఎక్కిన యాదయ్యకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది నచ్చజెప్పి కిందకు దింపేందుకు ప్రయత్నించారు. ఈక్రమంలో సెల్‌ టవర్‌ పై నుంచి దిగుతుండగా.. జారిపడి ప్రాణాలు కోల్పోయాడు.

భార్య కాపురానికి రావట్లేదని.. సెల్‌ టవర్‌ ఎక్కిన యువకుడి మృతి
భార్య కాపురానికి రావట్లేదని.. సెల్‌ టవర్‌ ఎక్కిన యువకుడి మృతి

Man Died: కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించే ప్రయత్నం చేసిన వ్యక్తి.. పట్టుతప్పడంతో కింద పడి మృతి చెందిన ఘటన మహబూబ్​నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. జడ్చర్ల రైల్వే స్టేషన్ సమీపంలో పాత బజార్​కు చెందిన యాదయ్య(25) మద్యం మత్తులో ఆత్మహత్య చేసుకుంటానని సెల్​ఫోన్ టవర్ ఎక్కాడు. విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని యువకుడికి నచ్చజెప్పి కిందకు దింపేందుకు యత్నించారు. కిందకు దిగుతున్న సమయంలో చెయ్యి పట్టుతప్పడంతో కిందపడ్డ యాదయ్య అక్కడికక్కడే మృతి చెందాడు.

పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది యాదయ్యను రక్షించేందుకు ప్రయత్నించినా ఫలించలేదు. భార్య వదిలిపెట్టి వెళ్లడంతో మద్యం మత్తులో సెల్ టవర్ ఎక్కిన యువకుడు ప్రాణాలు పోగొట్టుకున్నాడు. మృతదేహాన్ని బాదేపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కాగా ప్రజలు, పోలీసులు యువకుడిని కిందికి దింపేందుకు ప్రయత్నించినా ఫలించకపోవడంతో పాటు, కళ్ల ముందే వ్యక్తి మృతి చెందిన ఘటన అక్కడున్న వారిని కలిచివేసింది. మద్యం మత్తులో యాదయ్య టవర్‌ ఎక్కినట్టు పోలీసులు గుర్తించారు.

ఇదీ చదవండి:

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details