తెలంగాణ

telangana

By

Published : Jun 20, 2021, 2:27 PM IST

ETV Bharat / crime

ప్రియుడిని తాళ్లతో కట్టేసి.. ప్రియురాలిపై అత్యాచారం

ప్రేమజంటపై దాడి చేసి యువతిని అత్యాచారం చేసిన ఘటన ఏపీలోని గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. ప్రియుడిని తాళ్లతో కట్టేసి దుండగులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.

two-persons-attack-on-lovers-and-after-girl-raped-by-them-in-gunturu-district
ప్రేమజంటపై దాడి చేసి.. యువతిపై అత్యాచారం

ఏపీలోని గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధి సీతానగరంలో దారుణం చోటుచేసుకుంది. పుష్కరఘాట్‌లో రాత్రి ప్రేమజంటపై అఘాయిత్యం జరిగింది. కృష్ణానది తీరం ఇసుకలో కూర్చున్న ప్రేమజంటపై ఇద్దరు దుండగులు దాడి చేశారు. ప్రియుడిపై దాడి చేసి.. తాళ్లతో కట్టేశారు. అనంతంరం పుష్కరఘాట్​లోనే యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు.

తెల్లవారుజామున తాడేపల్లి పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. యువతిని చికిత్స కోసం పోలీసులు ఆస్పత్రికి తరలించారు. యువతిపై అత్యాచారం కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ఘటనకు బ్లేడ్‌ బ్యాచ్‌ యువకులే కారణమని అనుమానించిన పోలీసులు.. నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చదవండి:పొంచి ఉన్న జీవాయుధ ముప్పు!

ABOUT THE AUTHOR

...view details