తెలంగాణ

telangana

లైన్​మెన్​కు బెదిరింపులు.. ఇద్దరు అరెస్టు

విహహేతర సంబంధం విషయంలో ఓ మహిళ మరో యువకుడితో కలిసి విద్యుత్​ శాఖలో లైన్​మెన్​గా పనిచేసే వ్యక్తిని బెదిరించి డబ్బులు వసూలు చేశారు. అదే పనిగా పలు మార్లు డబ్బులు డిమాండ్ చేయడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో జరిగింది.

By

Published : Mar 20, 2021, 1:56 PM IST

Published : Mar 20, 2021, 1:56 PM IST

Two persons arrested for threatening case in Yadadri Bhuvanagiri district
లైన్​మెన్​కు బెదిరింపులు.. ఇద్దరు అరెస్టు

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు పురపాలిక కేంద్రంలో ఓ మహిళ, మరో యువకుడితో కలిసి వివాహేతర సంబంధం విషయంలో... విద్యుత్​ శాఖలో పనిచేసే ఓ లైన్​ మెన్​ను బెదిరించి డబ్బులు వసూలు చేశారు. పట్టణ కేంద్రానికి చెందిన 28 ఏళ్ల యువకుడు, 38 ఏళ్ల మహిళ కలిసి తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని బాధితుడు ​ఆరోపించారు.

అదే పనిగా పలుమార్లు డబ్బులు డిమాండ్ చేయడంతో బాధితుడు మోత్కూరు పోలీసులను ఆశ్రయించాడు. వెంటనే నిందితులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: మాస్క్​ లేదని జరిమానా- మార్షల్​పై మహిళ దాడి

ABOUT THE AUTHOR

...view details