తెలంగాణ

telangana

By

Published : Apr 3, 2021, 9:37 AM IST

Updated : Apr 3, 2021, 11:11 AM IST

ETV Bharat / crime

టిప్పర్ బీభత్సం​.. ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు

మేడ్చల్​ మున్సిపాలిటీలో టిప్పర్​ బీభత్సం సృష్టించింది. మొక్కలకు నీళ్లు పోస్తున్న పారిశుద్ధ్య కార్మికులను.. అతివేగంగా వచ్చిన టిప్పర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి నుజ్జునుజ్జు అయ్యాడు.

road accident , Medchal municipality
టిప్పర్ బీభత్సం​.. ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు

మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఉదయం ఆరు గంటల సమయంలో డివైడర్​పై నాటిన మొక్కలకు పారిశుద్ధ్య కార్మికులు నీళ్లు పోస్తున్నారు. ఈ క్రమంలో అతి వేగంగా తూప్రాన్ నుంచి నగరానికి రాంగ్​ రూట్​లో ఓ టిప్పర్​ దూసుకొచ్చింది. ఆ వాహనం అదుపు తప్పి.. డివైడర్​ ఎక్కి కార్మికులను ఢీకొట్టింది.

ఈ ఘటనలో దశరథ(48) అనే వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. అతని శరీరం నుజ్జునుజ్జు అయ్యింది.మరో మహిళా కార్మికురాలికితీవ్రగాయాలు కావడంతో.. ఆసుపత్రికి తరలించారు. టిప్పర్​ డ్రైవర్​ అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Last Updated : Apr 3, 2021, 11:11 AM IST

ABOUT THE AUTHOR

...view details