తెలంగాణ

telangana

By

Published : May 16, 2021, 12:10 PM IST

Updated : May 16, 2021, 12:16 PM IST

ETV Bharat / crime

దారుణం: వృద్ధురాలిని గొంతునులిమి చంపిన దుండగులు

శామీర్‌పేట పీఎస్‌ పరిధిలోని లాల్‌గాడి మలక్‌పేటలో గుర్తుతెలియని దుండగులు ఓ వృద్ధురాలిని హత్య చేశారు. గొంతు నులిమి ప్రాణాలు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలిని పరిశీలించారు. బంగారు ఆభరణాలు కోసమా లేక ఇతర కారణాలతో హత్యకు పాల్పడ్డారా అనే కోణంలో విచారణ చేస్తున్నారు.

వృద్ధురాలిని గొంతునులిమి చంపిన దుండగులు
వృద్ధురాలిని గొంతునులిమి చంపిన దుండగులు

మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని లాల్‌గాడి మలక్‌పేటలో దారుణం చోటుచేసుకుంది. పొలంపల్లి లక్ష్మి అనే వృద్ధురాలిని గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. రైతు వేదిక సమీపంలోని నిర్మాణంలో ఉన్న భవనంలోకి తీసుకువచ్చి గొంతు నులిమి హత్యకు పాల్పడ్డారు.

స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బంగారు ఆభరణాల కోసమా లేదా వ్యక్తిగత కక్షలతో హత్య చేశారా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చూడండి: వైద్యుడినంటూ వల.. పెళ్లిచేసుకుంటానని నగదు మాయం

Last Updated : May 16, 2021, 12:16 PM IST

ABOUT THE AUTHOR

...view details