Man Suicide in Sangareddy : సంతోషంగా నిశ్చితార్థానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్న యువకుడు.. ఆ శుభకార్యం జరగాల్సిన రోజే అనుమానాస్పద స్థితిలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. జోగిపేట ఎస్సై సామ్యానాయక్, కుటుంబ సభ్యుల వివరాలు.. మెదక్ జిల్లా టేక్మాల్కు చెందిన గుంజి బాలరాజ్ (25), ఆయన సోదరుడు శంకర్ ఏడాదిగా అదే మండలంలోని పల్వంచ సోలార్ ప్లాంట్లో పనిచేస్తున్నారు. బాలరాజ్ డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్నాడు.
ఆదివారం అర్ధరాత్రి వరకు విధి నిర్వహణలోనే ఉన్న బాలరాజ్ సోమవారం ఉదయానికల్లా సంగారెడ్డి జిల్లా అందోలు మండలం దానంపల్లి శివారులో ఓ విద్యుత్ స్తంభానికి ఉరేసుకొని కనిపించాడు. సమాచారం అందుకున్న జోగిపేట పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. బాధిత కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడికి చేరుకొని బోరుగా విలపించారు. శుభకార్యం జరగాల్సిన ఇంట్లో విషాదం నెలకొందని కన్నీరుమున్నీరయ్యారు. మృతుడి సోదరుడు శంకర్ ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు.