తెలంగాణ

telangana

ETV Bharat / crime

టీవీఎస్ లూనాను ఢీకొట్టిన లారీ... కౌలు రైతు మృతి

భువనగిరిలోని ఇందిరానగర్​ వద్ద ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో కౌలురైతు అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

By

Published : Mar 29, 2021, 12:46 PM IST

lorry hits tvs luna farmer died
టీవీఎస్ లూనాను ఢీకొట్టిన లారీ... కౌలు రైతు మృతి

యాదాద్రి భువనగిరిజిల్లా ఇందిరానగర్​ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. యాదాద్రిలోని ఎల్బీనగర్​కి చెందిన కౌలురైతు రామస్వామి వ్యవసాయ పనుల నిమిత్తం పొలం వద్దకు టీవీఎస్ లూనా మీద బయలుదేరాడు.

ఇందిరానగర్​ వద్ద వెనుక నుంచి వచ్చిన లారీ... లూనాను ఢీకొట్టింది. ఈ ఘటనలో రామస్వామి లారీ చక్రాల కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు.

ఇదీ చూడండి:అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి.. కారణమేంటి?

ABOUT THE AUTHOR

...view details