తెలంగాణ

telangana

By

Published : May 4, 2021, 2:54 PM IST

ETV Bharat / crime

దారుణం.. భార్యను కత్తితో నరికి చంపిన భర్త

కట్టుకున్నవాడే... కాలయముడయ్యాడు. తోడుగా ఉండాల్సిన భర్త... తోడేలుగా మారాడు. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి అతికిరాతకంగా తన భార్యను హతమార్చాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

husband killed her wife with knife in nizamabad district
దారుణం.. భార్యను కత్తితో నరికి చంపిన భర్త

నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం నీల గ్రామంలో దావూజి అనే వ్యక్తి... తన భార్యను కత్తితో నరికి చంపాడు. దావూజికి ఇద్దరు భార్యలు కాగా... మొదటి సతీమణి మనుబాయితో వారం నుంచి గొడవలు జరుగుతున్నాయి.

నిన్న రాత్రి కత్తితో ఆమెను అతికిరాతకంగా నరికి చంపాడు. అనంతరం రెంజల్‌ పోలీసులకు దావూజి లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:'కబ్జాలకు పాల్పడ్డ మంత్రులందరిపై విచారణ చేపట్టాలి '

ABOUT THE AUTHOR

...view details