తెలంగాణ

telangana

లారీ ఢీకొని ఐదేళ్ల పాప మృతి

By

Published : Feb 11, 2021, 3:14 PM IST

Updated : Feb 11, 2021, 5:06 PM IST

సంతోషంగా ఇంటిముందు ఆడుకుంటున్న ఓ పాపను లారీ మృత్యు రూపంలో కబలించింది. అతివేగంగా దూసుకొచ్చిన లారీ పాప మీదినుంచి దూసుకెళ్లింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న పాప కళ్లముందే కానరానిలోకాలకు వెళ్లటంతో తల్లిదండ్రులు దుఃఖం అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది.

girl died in road accident at moranchapallty jayashankar bhupalpally district
లారీ ఢీకొని ఐదేళ్ల పాప మృతి

అతివేగంగా దూసుకొచ్చిన లారీ ఓ పాప నిండు ప్రాణాలు బలితీసుకుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మండల కేంద్రంలోని మొరంచపల్లి గ్రామం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంటి ముందు ఆడుకుంటున్న ఐదేళ్ల మిల్కీ అనే పాపను టిప్పర్ లారీ ఢీ కొట్టటంతో.. అక్కడికక్కడే మృతి చెందింది.

ఆగ్రహించిన స్థానికులు ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్​ను చితకబాది.. టైర్లలో గాలి తీసేశారు. పాప బంధువులు, గ్రామస్థులు ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. కలెక్టర్ వచ్చేవరకు ధర్నా విరమించేది స్పష్టం చేశారు. జాతీయ రహదారి కావటంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి.. కిలోమీటర్​ మేర వాహనాలు నిలిచిపోయాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డ్రైవర్​ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

లారీ ఢీకొని ఐదేళ్ల పాప మృతి

ఇదీ చూడండి:'ఉద్యోగం ఎరవేసి... మహిళను అరబ్​షేక్​కు అమ్మేశాడు'

Last Updated : Feb 11, 2021, 5:06 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details