తెలంగాణ

telangana

By

Published : Dec 28, 2022, 11:36 AM IST

ETV Bharat / crime

భార్యపై అనుమానం.. కుమారుడిని హత్య చేసిన తండ్రి

Father Killed Son : భార్యపై పెంచుకున్న అనుమానం పెనుభూతమైంది. ముక్కుపచ్చలారని పసివాడి ప్రాణాలు తీయించింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్​లోని పెనుకొండలో చోటుచేసుకుంది.

Father Killed his Son
Father Killed his Son

Father Killed his Son: ఆంధ్రప్రదేశ్​లోని శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో దారుణం చోటుచేసుకుంది. భార్యపై అనుమానంతో కుమారుడిని హత్య చేశాడు ఓ తండ్రి. రామగిరికి చెందిన గంగరాజుకు, శివాపురానికి చెందిన కవితతో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. రెండేళ్ల నుంచి భార్యపై అనుమానం పెంచుకున్న భర్త.. భార్యను వేధిస్తున్నాడు. ఈ నేపథ్యంలో కవితను తల్లిదండ్రులు పుట్టింటికి తీసుకెళ్లారు. ఆ సమయంలో భార్య కవిత కడుపుతో ఉండి బిడ్డకు జన్మనివ్వటంతో గంగరాజు అనుమానం మరింత పెరిగింది.

ఆ బిడ్డను ఎలాగైనా హత్య చేయాలని నిర్ణయించుకున్న గంగరాజు.. భార్యకు మాయమాటలు చెప్పి బిడ్డను బయటకు తీసుకెళ్లాడు. ఎంతసేపటికీ బిడ్డ ఇంటికి రాకపోవటంతో అనుమానం వచ్చిన కవిత.. భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. గంగరాజును అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరపగా నిందితుడు హత్య చేసినట్టు ఒప్పుకున్నాడు.

ఇవీ చదవండీ

ABOUT THE AUTHOR

...view details