తెలంగాణ

telangana

By

Published : Apr 16, 2021, 3:59 PM IST

ETV Bharat / crime

బైక్​ను ఢీకొన్న అంబులెన్స్​.. ఇద్దరికి గాయాలు

బైక్​ను అంబులెన్స్​ ఢీకొన్న ఘటనలో ఇద్దరు గాయపడిన ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

accident
బైక్​ను ఢీకొన్న అంబులెన్స్​

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బైక్​ను అంబులెన్స్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. నగరంలోని కోర్టు చౌరస్తా వద్ద ఓ కరోనా పాజిటివ్ డెడ్ బాడీని తీసుకెళ్లేందుకు వేగంగా వెళ్తుతున్న అంబులెన్స్ బైక్​ను ఢీకొట్టింది.

అంబులెన్స్ డ్రైవర్​తో పాటు, బైక్​పై వెళ్తున్న ఇద్దరిలో డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. ఇరువురిని చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో అంబులెన్స్ ముందు భాగం ధ్వంసమైంది.

ఇదీ చదవండి:గ్లాసు గుర్తు కోల్పోయిన జనసేన

ABOUT THE AUTHOR

...view details