తెలంగాణ

telangana

By

Published : Jan 2, 2023, 10:57 PM IST

ETV Bharat / crime

దారుణం.. 9 ఏళ్ల బాలికపై 49 ఏళ్ల వ్యక్తి అత్యాచారం

Violence against minor girl: ఆంధ్రప్రదేశ్​లోని పార్వతీపురం మన్యం జిల్లాలో మైనర్​పై అఘాయిత్యం జరిగింది. ఓ బాలికపై 49 ఏళ్ల వ్యక్తి బలత్కారానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు వీరఘట్టం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరఘట్టం ఎస్సై హరికృష్ణ కేసు నమోదు చేసి బాలికను వైద్య చికిత్స నిమిత్తం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు.

Violence against minor girl
Violence against minor girl

Violence against a minor girl: ఆంధ్రప్రదేశ్​లోని పార్వతీపురం మన్యం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తొమ్మిది ఏళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన వ్యక్తి బలత్కారానికి పాల్పడ్డాడు. బాలిక శనివారం సాయంత్రం బహిర్భూమికి వెళ్లిన సమయంలో తాత వరుసైన 49 ఏళ్ల వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తల్లిదండ్రులకు చెప్పకుండా బాలిక ఉండిపోయింది. ఆదివారం ఉదయం కుమార్తె పరిస్థితి గమనించిన తల్లి ఘటనపై ఆరా తీసింది.

భయపడిపోయిన బాలిక విషయం చెప్పడంతో తల్లిదండ్రులు వీరఘట్టం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరఘట్టం ఎస్సై హరికృష్ణ కేసు నమోదు చేసి బాలికను వైద్య చికిత్స నిమిత్తం పాలకొండ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. పార్వతీపురం దిశ డిఎస్పీతో పాటు డీఎస్పీ జీవీ కృష్ణారావు పాలకొండ ఆసుపత్రికి చేరుకొని ఘటనపై ఆరా తీశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details