వరంగల్ తూర్పు నియోజకవర్గం కరీమాబాద్ దేశాయిపేటలో స్థానిక ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పర్యటించారు. వలస కూలీలకు 12 కిలోల బియ్యం, నగదు అందజేశారు. వలస కూలీలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచనల మేరకు సామాజిక దూరం పాటించి కరోనాను నివారించేందుకు ప్రజలు సహకరించాలని కోరారు.
వలస కూలీలకు ఎమ్మెల్యే సరకుల అందజేత
వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ వలస కూలీలకు నిత్యావసర సరకులు, నగదు అందజేశారు. లాక్డౌన్తో ఎవరికి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని భారోసా కల్పించారు.
ఎమ్మెల్యే బియ్యం, నగదు పంపిణీ