తెలంగాణ

telangana

ETV Bharat / city

రెండు గంటల ముందు నుంచే లోనికి అనుమతి

దేశవ్యాప్తంగా నీట్ ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రెండు గంటల ముందే లోనికి ప్రవేశం కల్పిస్తున్నామని.. నిమిషం నిబంధన ఉన్నందున విద్యార్థులు ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

By

Published : May 4, 2019, 4:19 PM IST

ఉమారాణి

ఆదివారం నిర్వహించేబోయే ప్రతిష్టాత్మక నీట్ అర్హత కోసం వరంగల్​లో 8కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 5590 మంది విద్యార్ధులు హాజరవుతున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు పరీక్ష ప్రారంభం అవుతున్నా... 12 గంటల నుంచీ విద్యార్ధులను కేంద్రాల్లోకి అనుమతిస్తామని......వరంగల్ నిట్ నిర్వహణా బాధ్యులు, వరంగల్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ ఉమారాణి తెలిపారు. 1.30గంటల తరువాత...ఒక్క నిమిషం ఆలస్యమైనా ఎవ్వరినీ అనుమతించబోమని స్పష్టం చేశారు. సెల్ ఫోన్లు, కాలిక్యులేటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలే కాకుండా చైన్లు ఇతర అలంకరణ వస్తువులను అనుమతించమంటున్న ఉమారాణితో మా ప్రతినిధి రవిచంద్ర ముఖాముఖి.ఇవీ చూడండి:
నారాయణపేట కలెక్టరేట్‌లో రైతు ఆత్మహత్యాయత్నం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details