తెలంగాణ

telangana

By

Published : Nov 16, 2019, 5:07 AM IST

ETV Bharat / city

తెలంగాణ కుంభమేళకు యంత్రాంగం సన్నద్ధం..!

మేడారం మహా జాతరకు ముహూర్తం సమీపిస్తోంది. ఈ యేడు జాతరలో పలు ప్రపంచ రికార్డులు నెలకొల్పాలని అధికార యంత్రాంగా సన్నద్ధమవుతోంది. ప్రధానంగా ప్లాస్టిక్‌ లేకుండా జాతర జరిపేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ప్రదర్శనల ద్వారా ప్లాస్టిక్‌ నిషేదం పై అవగాహన కల్పిస్తూ.. ప్రత్యామ్నాయం సూచిస్తున్నారు.

తెలంగాణ కుంభమేళకు యంత్రాంగం సన్నద్ధం..!

మేడారం జాతర - ఫిబ్రవరి 5 నుంచి 8 వరకు
అరణ్యంలో కొలువైన వనదేవతలు జనం మధ్యకు విచ్చేసే శుభ సమయం దగ్గరికొచ్చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 5 నుంచి 8 వరకు నాలుగు రోజుల పాటు అంగరంగ వైభవంగా మేడారం జాతర జరగనుంది. కోటిమందికి పైగా భక్తజనం...గద్దెలపైన కొలువైన తల్లులకు పూజలు చేస్తారు. బెల్లంతో మొక్కులు చెల్లించుకుంటారు. మేడారం పరిసరాలు భక్త జనసంద్రమవుతాయి. ఇసుకెస్తే రాలనంత మంది జనంతో జంపన్నవాగు కిటకిటలాడుతుంది. అందుకే ఈ జన జాతరను తెలంగాణ కుంభమేళాగా కూడా పేర్కొంటారు.

తెలంగాణ కుంభమేళకు యంత్రాంగం సన్నద్ధం..!

రూ. 75 కోట్లు మంజూరు
మేడారం జాతరకు చేయాల్సిన ఏర్పాట్లపై మంత్రులు, అధికారులు ఇప్పటికే పలుమార్లు సమీక్షలు జరిపారు. 75 కోట్ల రూపాయలు మంజూరు కాగా... పనులన్నీ జనవరి 15లోపు పూర్తి చేయాలని నిర్ణయించారు. ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా.. ట్రైబల్ విలేజ్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

"ప్రకృతిని కొలిచే వేడుకలో.. పర్యావరణానికి ఎటువంటి హానీ జరగకుండా జాతర నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది"

ప్లాస్టిక్ రహిత జాతరకు కసరత్తు

  • జిల్లా అధికారులు జాతరలో మూడు ప్రపంచ రికార్డులు నెలకొల్పేలా చర్యలు చేపడుతున్నారు.
  • ప్లాస్టిక్‌ రహిత జాతర, పారిశుద్ధ్యం, రక్త వర్గాల నిర్ధరణ వంటి అంశాల్లో మూడు ప్రపంచ రికార్డులు నెలకొల్పేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
  • ప్లాస్టిక్ రహిత మేడారం జాతర కోసం అధికారులు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు. ప్లాస్టిక్ వస్తువులు సేకరించిన వారికి ప్రోత్సాహకాలు అందించాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది.
  • ప్రత్యామ్నాయాలు చూపుతూ ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.

కలెక్టరేట్​లో ప్లాస్టిక్ రహిత ప్రదర్శన
ఇవాళ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్లాస్టిక్ రహిత క్యారీ బ్యాగులు, ప్లేట్లు, కప్పులు, స్పూన్లతో ఓ ప్రదర్శన నిర్వహించనున్నారు. మేడారంలో వ్యాపారాలు చేసుకునే వారికి ప్లాస్టిక్ వస్తువుల స్ధానంలో ప్రత్యామ్నాయంగా వాడే వస్తువులపై అవగాహన కలిగించేందుకు కార్యక్రమం ఏర్పాటు చేశారు.

ఇదీ చదవండి: వైభవంగా యాదాద్రి క్షేత్రంలో ఊంజల్​ సేవ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details