తెలంగాణ

telangana

ETV Bharat / city

'తెలంగాణలో లంచం ఇవ్వనిదే ఏ పని జరగడం లేదు' - rahul gandhi fire on cm kcr

తెరాస పాలనలో కేసీఆర్​ కుటుంబానికి తప్ప ఎవరికి మేలు జరగలేదని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ విమర్శించారు. రాష్ట్రంలో లంచం ఇవ్వనిదే  ఏ పని జరగడంలేదని ఆరోపించారు.

వ్యాపారం చేయడానికి ఎలాంటి అనుమతి అవసరం లేదు: రాహుల్​

By

Published : Apr 1, 2019, 5:02 PM IST

Updated : Apr 1, 2019, 5:25 PM IST

ప్రజలు సాధించుకున్న తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబానికి తప్ప ఎవరికీ మేలు జరగలేదని వనపర్తి సభలో రాహుల్​ గాంధీ మండిపడ్డారు. రాష్ట్రంలో ఉన్న ఎన్నో ప్రాజెక్టులు కాంగ్రెస్‌ ప్రభుత్వం మంజూరు చేసినవేనని తెలిపారు. తాము ప్రారంభించిన ప్రాజెక్టుల పేర్లు మార్చి రీడిజైనింగ్​ పేరుతో తెరాస ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. అధికారులకు లంచం ఇవ్వనిదే తెలంగాణలో ఏ పనీ జరగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో, దేశంలో మేడిన్ చైనా వస్తువులు కాదు... మేడిన్ తెలంగాణ వస్తువులు వాడాలని ఆకాంక్షించారు. పేదలు వ్యాపారం చేయడానికి ఎలాంటి అనుమతి అవసరం లేదన్నారు. కాంగ్రెస్​ అధికారంలోకి రాగానే ఏరకమైన అనుమతి లేకుండా కుటీర పరిశ్రమలు, చిన్న వ్యాపారాలు నిర్వహించుకోవచ్చని తెలిపారు.

వ్యాపారం చేయడానికి ఎలాంటి అనుమతి అవసరం లేదు: రాహుల్​
Last Updated : Apr 1, 2019, 5:25 PM IST

ABOUT THE AUTHOR

...view details