భాజపా నుంచిబాణాల
జహీరాబాద్ స్థానానికి చివరి రోజు నామినేషన్ల జోరు
సంగారెడ్డి కలెక్టరేట్ వివిధ పార్టీల కార్యకర్తలు, నేతలతో సందడిగా మారింది. జహీరాబాద్ లోక్సభ స్థానానికి చివరి రోజు నామినేషన్లు వెల్లువెత్తాయి. తెరాస నుంచి బీబీ పాటిల్, భాజపా నుంచి బాణాల లక్ష్మారెడ్డి నామ పత్రాలు దాఖలు చేశారు. అభ్యర్థులు ఎవరికి వారు తమ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.
నామినేషన్ వేస్తున్న అభ్యర్థులు
అటు భాజపా అభ్యర్థి బాణాల లక్ష్మారెడ్డి ఇవాళే నామినేషన్ వేశారు. కార్యకర్తలతో ర్యాలీగా వచ్చి కలెక్టరేట్లో రిటర్నింగ్ అధికారికి నామ పత్రాలు సమర్పించారు. ఎంపీగా గెలిపిస్తే అందరికి అందుబాటులో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని బాణాల చెప్పారు. దేశం అభివృద్ధి చెందాలంటే భాజపా మళ్లీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు.
ఇవీ చూడండి:హైదరాబాద్ ఇమేజ్ తగ్గిపోయింది: రేవంత్