తెలంగాణ

telangana

ETV Bharat / city

'అధికారంలోకి రాగానే ఆదాయపుపన్ను రద్దు చేస్తాం'

కాంగ్రెస్​ అధికారంలోకి రాగానే బొగ్గు గని కార్మికులకు ఆదాయపుపన్ను రద్దు చేస్తామని పెద్దపల్లి లోక్​సభ కాంగ్రెస్​ అభ్యర్థి చంద్రశేఖర్​ అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఏరియాలోని అర్జీ-2, గోదావరిఖనిలోని 11వ బొగ్గు గనిలో ప్రచారం నిర్వహించారు.

By

Published : Mar 30, 2019, 4:49 PM IST

కార్మికులతో చంద్రశేఖర్​

ఆదాయపుపన్ను రద్దు చేస్తాం
పెద్దపల్లి లోక్​సభ కాంగ్రెస్​ అభ్యర్థి చంద్రశేఖర్​ బొగ్గు గనుల్లో ప్రచారం నిర్వహించారు. రామగుండం ఏరియాలోని అర్జీ-2, గోదావరిఖనిలోని 11వ బొగ్గు గనిలోని కార్మికులను కలుసుకున్నారు. హస్తం గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. కార్మికుల సమస్యల పట్ల అవగాహన ఉందన్నారు.

మెడికల్ కళాశాల

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కార్మికులకు ఆదాయపు పన్ను రద్దుతో పాటు... మెడికల్ కళాశాల ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తెరాస, భాజపాకు ఓటేస్తే కార్మికులకు ఒరిగేది ఏమీ లేదన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్​ నేతలు, ఐఎన్​టీయూసీ నాయకులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి:'దాడులు చేసినంత మాత్రాన మోదీకి జైకొట్టం'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details