తెలంగాణ

telangana

By

Published : Sep 2, 2020, 5:56 PM IST

ETV Bharat / city

'వైఎస్సార్​ ప్రవేశపెట్టిన పథకాలు దేశానికే ఆదర్శం'

నిజామాబాద్​ జిల్లా కాంగ్రెస్​ కార్యాలయంలో నాయకులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్​కు నివాళులర్పించారు. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను గుర్తు చేసుకున్నారు.

ysr death anniversary program in nizamabad
ysr death anniversary program in nizamabad

మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నాయకులు నివాళులర్పించారు. రాజశేఖర్​రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మనల మోహన్ రెడ్డి నివాళులర్పించారు. వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని మోహన్​రెడ్డి కొనియాడారు. ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేసి జిల్లా రైతాంగాన్ని ఆదుకున్నారని గుర్తు చేసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details