తెలంగాణ

telangana

By

Published : Oct 19, 2020, 12:03 PM IST

ETV Bharat / city

' తెరాస, ఎంఐఎం కలిసి భూ దందా చేస్తున్నాయి'

వందల కోట్ల విలువ చేసే వక్ఫ్స్​ భూములను ఎంఐఎం, తెరాస నాయకులు కలిసి కబ్జా చేస్తున్నారని ఎంబీటీ రాష్ట్ర అధ్యక్షుడు అంజదుల్లా ఖాన్ ఆరోపించారు. వక్ఫ్​ భూములపై నిర్మాణాలు చేపడుతున్నా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు పట్టించుకోవడం లేదన్నారు. హైదరాబాద్​లో వరదలకు చెరువుల కబ్జాయే ప్రధాన కారణమని ఆరోపించారు.

majlis bachavo thaharik state precident amzadulla khan fires  to protect waqf lands on government
'నిజామాబాద్ జిల్లా కేంద్రంలో భూ మాఫియా దందా నడుస్తోంది'

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో భూ మాఫియా దందా నడుస్తోందని మజ్లీస్ బచావో తహరిక్ (ఎంబీటీ) రాష్ట్ర అధ్యక్షుడు అంజదుల్లా ఖాన్ ఆరోపించారు. వందల కోట్ల విలువ చేసే వక్ఫ్ భూములను ఎంఐఎం, తెరాస నాయకులు కలిసి కబ్జా చేస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ వక్ఫ్​ భూములను పరిరక్షిస్తామని చెప్పి.. ఇప్పటి వరకు కమిషన్​ను ఏర్పాటు చేయలేదని విమర్శించారు. ఈ మేరకు నిజామాబాద్ నగరంలోని అబ్దుల్ రెహ్మాన్ గెస్ట్ హౌస్, బోధన్ రోడ్​లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ప్రసంగించారు.

నగర నడిబొడ్డులో ఉన్న భూములపై ఇటీవలే షాపింగ్ మాల్స్, మల్టి కాంప్లెక్స్, స్టార్ హోటల్స్ ​నిర్మించారని.. మొత్తం 4,302 గజాల భూమి కబ్జాకు గురైందని తెలిపారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు పట్టించుకోవడం లేదన్నారు. 12 శాతం రిజర్వేషన్​ను సీఎం మరిచిపోయారని దుయ్యబట్టారు. నగరంలోని మైనార్టీ ప్రాంతాల్లో కనీస సౌకర్యాలు కరవయ్యాయన్నారు. హైదరాబాద్​లో వరదలకు సామాన్యులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని.. చెరువుల కబ్జాయే ప్రధాన కారణమని ఆరోపించారు.

ఇదీ చూడండి: కరోనా నుంచి కోలుకున్న రెండు లక్షల మంది బాధితులు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details