నల్గొండ పట్టణం బీటీఎస్కు చెందిన ఎండీ నౌషిన్ హైదరాబాద్లోని ప్రభుత్వ కళాశాలలో 2018లో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. యునాని మెడిసిన్ కోసం ఈ ఏడాది మార్చిలో అరబిక్ పేపర్-1,2 పరీక్షలు రాసింది. ఇటీవల విడుదలైన ఫలితాల్లో ఆమె రాసిన పరీక్షకు కాకుండా ఉర్దూ పేపరు రాసినట్లు.. సున్నా మార్కులు వచ్చినట్టు పేర్కొన్నారు. ప్రభుత్వం తమకు తగిన న్యాయం చేయాలని నౌషిన్ తండ్రి ఎండీ జానీమియా తెలిపారు.
ఒక పరీక్ష రాస్తే మరో పరీక్షకు మార్కులేశారు
ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాల్లో అవకతవకలు జరిగిన విషయం విదితమే. హైదరాబాద్ ప్రభుత్వ కళాశాల నుంచి ఎండీ నౌషీన్ అరబిక్ పేపర్ 1,2 పరీక్షలు రాయగా తాను ఉర్దూ పరీక్ష రాసినట్లు 0 మార్కులు వేసింది ఇంటర్ బోర్డు.
అరబిక్ రాస్తే ఉర్దూకు మార్కులిచ్చారంటున్న జానీమియా