తెలంగాణ

telangana

సంతోశ్‌బాబు విగ్రహావిష్కరణ చేయనున్న మంత్రి కేటీఆర్‌

By

Published : Jun 15, 2021, 5:19 AM IST

Published : Jun 15, 2021, 5:19 AM IST

minister ktr visit in suryapet and inauguration the Santhosh babu statue
minister ktr visit in suryapet and inauguration the Santhosh babu statue

05:11 June 15

సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో మంత్రి కేటీఆర్‌ పర్యటన

గాల్వన్ లోయ ఘటనలో వీరమరణం పొందిన కర్నల్‌ సంతోష్ బాబు విగ్రహాన్ని ఆయన స్వస్థలం సుర్యాపేటలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నేడు అవిష్కరించనున్నారు. ఈ మేరకు పురపాలక సంఘం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సూర్యాపేటలో సంతోశ్‌ బాబు విగ్రహాన్ని ఏర్పాటు చేసి.. సంతోశ్‌బాబు చౌరస్తాగా ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి గతంలో హామీ ఇచ్చారు. 

ఈ మేరకు ఏడాదిలో ప్రభుత్వం 20 లక్షల ఖర్చుతో 9 అడుగుల కాంస్య విగ్రహాన్ని కోర్టు చౌరస్తాలో ఏర్పాటుచేశారు. ఇవాళ మధ్యాహ‌్నం 2గంటలకు మంత్రి కేటీఆర్‌.....కర్నల్‌ విగ్రహాన్ని ఆవిష్కరించున్నారు. అనంతరం సూర్యాపేటలో రోడ్డు విస్తరణ, సమీకృత మార్కెట్‌ యార్డుకు మంత్రి శంకుస్థాపన చేస్తారు. నల్గొండ జిల్లా నకిరేకల్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు.

ఇదీ చూడండి: Santhosh babu : కల్నల్‌ సంతోశ్‌బాబు వీరమరణానికి ఏడాది

ABOUT THE AUTHOR

...view details