తెలంగాణ

telangana

కరీంనగర్​లో బంద్.. బస్టాండ్​లో బందోబస్త్

By

Published : Oct 31, 2019, 1:42 PM IST

సకల జనభేరి సభలో మృతి చెందిన ఆర్టీసీ డ్రైవర్​ హఠాన్మరణం కార్మిక లోకాన్ని కంటతడి పెట్టించింది. కరీంనగర్​-2 డిపో డ్రైవర్​ బాబు మృతికి నిరసనగా ఉమ్మడి జిల్లా బంద్​కు ఆర్టీసీ ఐకాస పిలుపునిచ్చింది.

కరీంనగర్​లో ఆర్టీసీ కార్మికుల ఆందోళన


కరీంనగర్-2 డిపో​ డ్రైవర్​ బాబు మృతికి నిరసనగా ఆర్టీసీ ఐకాస ఉమ్మడి కరీంనగర్​ జిల్లా బంద్​కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు ఆర్టీసీ బస్సులు సజావుగా నడిచేందుకు బస్టాండ్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా.. భాజపా, తెదేపా, సీపీఐ, సీపీఎం నాయకులను ఎక్కడికక్కడ అరెస్టులు చేసి పోలీస్​ స్టేషన్​కు తరలించారు అంతకుముందు కరీంనగర్ బస్టాండ్ ఆవరణలో బస్సులను అడ్డుకున్న సీపీఐ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.

కరీంనగర్​లో ఆర్టీసీ కార్మికుల ఆందోళన

ABOUT THE AUTHOR

...view details