తెలంగాణ

telangana

By

Published : Aug 6, 2020, 3:42 PM IST

ETV Bharat / city

ముఖ్యమంత్రి దూరదృష్టితోనే మత్య్ససంపద అభివృద్ధి: గంగుల

ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో మాత్రమే మత్స్యసంపదను అభివృద్ది చేసుకోగలిగామని మంత్రి గంగుల కమలాకర్​ అన్నారు. కరీంనగర్​లోని దిగువ మానేరు జలాశయంలో 2 కోట్ల 36 లక్షల చేప పిల్లలను వదిలారు.

minister gangula kamalakar release fish into mid maneru project
ముఖ్యమంత్రి దూరదృష్టితోనే మత్య్ససంపద అభివృద్ధి: గంగుల

కాళేశ్వరం జలాల రాకతో చేపల దిగుమతి నుంచి ఎగుమతి స్థాయికి ఎదిగామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో మాత్రమే మత్స్యసంపదను అభివృద్ది చేసుకోగలిగామని వివరించారు. కరీంనగర్‌లోని దిగువ మానేరు జలాశయంలో 2 కోట్ల 36లక్షల చేప పిల్లలను విడుదల చేశారు. గతేడాది రెండు కోట్ల చేప పిల్లలు వదిలితే మత్స్యసంపద 7497మెట్రిక్‌ టన్నులకు పెరిగిందన్నారు. ఎలాంటి ఖర్చు లేకుండా మత్స్యకారులకు 75కోట్ల మేర లాభం చేకూరిందని మంత్రి పేర్కొన్నారు.

గతేడాది 769 చెరువుల్లో మాత్రమే నీటితో నింపామని... ఈ సారి 802 చెరువులు నింపడమే కాకుండా అన్ని చెరువుల్లోను చేపలను పెంచేందుకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. కాళేశ్వరం జలాలు రాక ముందు ఉప్పు చేపమాత్రమే అందుబాటులో ఉండేదని... ప్రస్తుతం మంచినీళ్లలో పెరిగే చేపలను పెంచగలుగుతున్నట్లు పేర్కొన్నారు. గతంలో దిగువమానేరులో నీళ్లు ఉండేవి కాదని... నీళ్లున్నా చేపలు పెంచాలన్న ఆలోచన కూడా ఉండేది కాదన్నారు.

ABOUT THE AUTHOR

...view details