తెలంగాణ

telangana

ETV Bharat / city

గాంధీకి పూజలు.. ఆ తర్వాతే పొలం పనులు

ఆ ఊరిలో మహాత్మాగాంధీని దైవంగా భావించి పూజలు చేస్తారు. ఏటా ఖరీఫ్ పనులు ప్రారంభించే ముందు ఉపవాసాలు ఉంటారు.

By

Published : Aug 2, 2019, 2:45 PM IST

villagers-prays-mahatma-gandhi

గాంధీకి పూజలు.. ఆ తర్వాతే పొలం పనులు

ఆంధ్రప్రదేశ్​లోని శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కేదారిపురం గ్రామస్థులు... మహాత్మా గాంధీని దైవంగా భావించి పూజలు చేయడాన్ని ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు. కొన్ని దశాబ్ధాలుగా.. గ్రామంలో ఈ సంప్రదాయం నడుస్తోంది. ఏటా ఖరీఫ్ పనుల ప్రారంభించే సందర్భంగా అంతా ఉపవాసాలు ఉంటూ గ్రామం మధ్యన మహాత్ముని చిత్రపటం పెట్టి పూజలు నిర్వహిస్తుంటారు. గాంధీకి పూజలు చేసిన తర్వాత.. పొలం పనులు ప్రారంభిస్తే అంతా మేలు జరుగుతుందని వారి నమ్మకం.

ABOUT THE AUTHOR

...view details