అంతుచిక్కని అస్వస్థతతో ఏలూరులో ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య పెరిగింది. అయితే.. వారిలో చాలామంది ఇప్పటికే డిశ్చార్జయ్యారు. మిగిలిన వారికి చికిత్స కొనసాగుతుండగా... పరిస్థితి విషమంగా ఉన్న ఐదుగురిని విజయవాడ తరలించారు. ఆదివారం 46 మంది బాధితులు వైద్యులను ఆశ్రయించారు. మొత్తం ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 300పైగా ఉంది. ఏలూరు పడమర వీధి, దక్షిణం వీధి, కొత్తపేట, శనివారపు పేట, ఆదివారపు పేట నుంచే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. కళ్లు తిరగడం, మూర్ఛ లాంటి లక్షణాలతో బాధితులు సతమతమవుతున్నారు. అయితే... చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. బాధితులు ఉన్న ప్రాంతాల్లో వైద్యారోగ్యశాఖ శిబిరాలతో పాటు... ఏలూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.
శనివారం అస్వస్థతకు గురైన 100మంది