తెలంగాణ

telangana

ETV Bharat / city

'కొట్టొద్దని ఎస్సై షూ పట్టుకున్నా వదల్లేదు.. నన్ను చంపేస్తారేమో'

తూర్పుగోదావరి జిల్లా సీతానగరం పోలీసులు ఓ ఎస్సీ యువకుడిని అరెస్టు చేసి... శిరోముండనం చేయించిన ఘటన తీవ్ర వివాదాస్పదమైంది. సీతానగరం సమీపంలో ఇసుక లారీలు అడ్డగోలుగా తిరుగుతున్నాయని.. దానిని ప్రశ్నించినందుకే తనపై దాడి చేశారని బాధితుడు వరప్రసాద్‌ వాపోయాడు. పోలీసుల తీరుపై ఎస్సీ, ఎస్టీ సంఘాల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

By

Published : Jul 21, 2020, 7:57 PM IST

'కొట్టొద్దని ఎస్సై షూ పట్టుకున్నా వదల్లేదు.. నన్ను చంపేస్తారేమో'
'కొట్టొద్దని ఎస్సై షూ పట్టుకున్నా వదల్లేదు.. నన్ను చంపేస్తారేమో'

ఆంధ్రప్రదేశ్​లోని తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో స్థానిక వైకాపా నాయకుడి అనుచరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఓ కేసులో వరప్రసాద్‌ అనే ఎస్సీ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇసుక లారీలు అడ్డుకున్నందుకు మునికూడలి వద్ద స్థానిక వైకాపా నాయకుడు కవల కృష్ణమూర్తి కారుతో వచ్చి ఢీకొట్టినట్లు బాధితుడు ఆరోపించాడు. పోలీస్‌స్టేషన్‌లో తనను విచక్షణారహితంగా కొట్టి జుట్టు, మీసాలు తీసేశారని.. తనని చంపేస్తారని బాధితుడు వాపోయాడు.

వైకాపా నాయకుడి అనుచరుడి ఫిర్యాదుపై కేసు నమోదు చేసి.. తన కుమారున్ని సీతానగరం పీఎస్‌కు పోలీసులు తీసుకువెళ్లారని భాదితుడి తల్లి చెబుతుంది. పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి చూసేసరికి తన బిడ్డ అపస్మారక స్థితిలో ఉన్నాడని... ఆవేదన వ్యక్తం చేసింది.

'కొట్టొద్దని ఎస్సై షూ పట్టుకున్నా వదల్లేదు.. నన్ను చంపేస్తారేమో'

ఇదీ చదవండి: పోలీస్​ స్టేషన్​లోనే ఎస్సీ యువకుడికి గుండు గీసిన పోలీసులు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details