తెలంగాణ

telangana

By

Published : Feb 27, 2021, 10:55 PM IST

ETV Bharat / city

తూర్పు నౌకాదళం అధిపతిగా వైస్ అడ్మిరల్ అజేంద్ర బహదూర్ సింగ్

తూర్పు నౌకాదళ అధిపతిగా వైస్ అడ్మిరల్ ఎ.బహదూర్‌సింగ్ నియమితులయ్యారు. ప్రస్తుత ఈఎన్​సీ అతుల్‌ కుమార్ జైన్‌ దిల్లీకి బదిలీ అయ్యారు. సోమవారం నుంచి బహదూర్‌సింగ్‌ బాధ్యతలు స్వీకరించనున్నారు.

vice-admiral-ajendra-bahadur-singh-has-been-appointed-as-the-new-commander-of-the-eastern-fleet
తూర్పు నౌకాదళం అధిపతిగా వైస్ అడ్మిరల్ అజేంద్ర బహదూర్ సింగ్

తూర్పు నౌకాదళం అధిపతిగా వైస్ అడ్మిరల్ అజేంద్ర బహదూర్ సింగ్ నియమితులయ్యారు. ఆయన సోమవారం బాధ్యతలను స్వీకరించనున్నారు. ప్రస్తుతం తూర్పు నౌకాదళ ఫ్లాగ్ అఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్గా​ ఉన్న అతుల్ కుమార్ జైన్​ దిల్లీలోని సమీకృత రక్షణ సిబ్బంది చీఫ్స్ అఫ్‌ స్టాఫ్ కమిటీ ఛైర్మన్​గా బాధ్యతలు చేపట్టనున్నారు.

నావికుల కవాతు, వివిధ యుద్ద నౌకలు, జలాంతర్గాముల సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం అతుల్ కుమార్ జైన్ నుంచి బహదూర్ సింగ్ బాధ్యతలు స్వీకరిస్తారు.

ఇదీ చదవండి:'సమస్యల పరిష్కారానికి తెరాస ప్రభుత్వం కట్టుబడి ఉంది'

ABOUT THE AUTHOR

...view details