తెలంగాణ

telangana

By

Published : Nov 21, 2021, 8:16 AM IST

ETV Bharat / city

TSICET counselling 2021 news : నేటి నుంచి ఐసెట్‌ చివరి విడత కౌన్సెలింగ్‌

నేటి నుంచి ఐసెట్‌ చివరి విడత కౌన్సెలింగ్(TSICET counselling 2021 news) జరగనుంది. రేపు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తామని.. రేపు, ఎల్లుండి వెబ్‌ ఆప్షన్లకు అవకాశం ఇస్తున్నట్లు కన్వీనర్‌ నవీన్‌ మిత్తల్‌ తెలిపారు.

TSICET 2021 COUNSELLING
TSICET 2021 COUNSELLING

ఐసెట్‌ చివరి విడత కౌన్సెలింగ్‌(TSICET counselling 2021 news) ఆదివారం నుంచి మొదలుకానుంది. కొత్తగా కౌన్సెలింగ్‌లో పాల్గొనే విద్యార్థులు ఈ నెల 21న ప్రాసెసింగ్‌ రుసుం చెల్లించి ధ్రువపత్రాల పరిశీలనకు స్లాట్‌ బుక్‌ చేసుకోవాలి. వారికి 22న ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. అనంతరం వారు 22, 23 తేదీల్లో వెబ్​ఆప్షన్లు ఇచ్చుకోవాలని, 26న సీట్లు కేటాయిస్తామని ప్రవేశాల కన్వీనర్‌ నవీన్‌ మిత్తల్‌ తెలిపారు. మొదటి విడత నాటికి కన్వీనర్‌ కోటాలో 26,845 సీట్లు (ఎంబీఏ, ఎంసీఏ) ఉండగా వాటిలో 19,209 మందికి సీట్లు దక్కాయి. చివరి విడత కౌన్సెలింగ్‌(TSICET counselling 2021 news)కు మరికొన్ని సీట్లు అందుబాటులోకి రానున్నాయని అధికార వర్గాలు తెలిపాయి.

ప్రత్యేక కౌన్సెలింగ్‌..

దేశవ్యాప్తంగా ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు, ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే సాంకేతిక విద్యాసంస్థ(జీఎఫ్‌టీఐ(Government Film and Television Institute))ల్లో ఖాళీగా ఉన్న సీట్ల కోసం సెంట్రల్‌ సీట్‌ అలకేషన్‌ అథారిటీ(సీశాబ్‌(Central Seat Allocation Board news)) రెండు విడతల ప్రత్యేక కౌన్సెలింగ్‌ నిర్వహించనుంది. ఐఐటీలు, ఇతర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశాలకు ఆరు విడతల జాయింట్‌ సీట్‌ అలకేషన్‌ అథారిటీ(జోసా(Joint Seat Allocation Authority news)) కౌన్సెలింగ్‌ శనివారంతో ముగిసింది.

ఈ క్రమంలో ఐఐటీ(IITs in India)లు మినహా మిగిలిన విద్యాసంస్థల్లో ఖాళీ సీట్లను భర్తీ చేస్తారు. ఇందుకోసం ఆ సంస్థల్లో మిగిలిపోయిన సీట్ల వివరాలను ఈ నెల 27న వెల్లడిస్తారు. 28 నుంచి రిజిస్ట్రేషన్‌ మొదలవుతుంది. మొదటి విడత సీట్లను డిసెంబరు 2న, రెండో విడత సీట్లను డిసెంబరు 7న కేటాయిస్తారు. పూర్తి వివరాలకు ‌www.csab.nic.in వెబ్‌సైట్‌ చూడవచ్చు.

మరోవైపు.. జాతీయ స్థాయి అర్హత పరీక్ష(నీట్‌)లో రాష్ట్రానికి చెందిన అభ్యర్థుల ర్యాంకులను (NEET Telangana ranks 2021) కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం శనివారం విడుదల చేసింది. నీట్‌ దరఖాస్తు సమయంలో అభ్యర్థులు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారీగా చేసిన నమోదు ఆధారంగా ఈ జాబితాను వర్సిటీ ప్రకటించింది. ఇది సమాచారం నిమిత్తమేనని, కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు అభ్యర్థులు విశ్వవిద్యాలయానికి దరఖాస్తు చేసిన తర్వాతే మెరిట్‌ జాబితాను విడుదల చేస్తామని వర్సిటీ వర్గాలు స్పష్టం చేశాయి. తన పరిధిలోని వైద్య కళాశాలల్లో యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు విశ్వవిద్యాలయం మొదట రిజిస్ట్రేషన్‌ ప్రక్రియకు నోటిఫికేషన్‌ జారీ చేస్తుంది. అభ్యర్థుల దరఖాస్తుల ఆధారంగా ధ్రువపత్రాలను పరిశీలించి ప్రొవిజనల్‌ మెరిట్‌ జాబితాను విడుదల చేసి కౌన్సెలింగ్‌ నిర్వహిస్తుంది.

ABOUT THE AUTHOR

...view details