తెలంగాణ

telangana

ETV Bharat / city

'పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు..జీవన్​ రెడ్డి నేతృత్వంలో కమిటీ'

తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ సమాయత్తమవుతోంది. అభ్యర్థుల ఎంపిక కోసం పీసీసీ ఏడుగురు సీనియర్ నాయకులతో ఓ కమిటీ ఏర్పాటు చేసింది. దీనికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నేతృత్వం వహించనున్నట్లు ప్రకటించింది.

By

Published : Jan 22, 2021, 5:43 PM IST

tpcc prepared a committee for graduate mlc elections 2021
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ కమిటీ

తెలంగాణలో పట్టభద్రుల మండలి ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై పీసీసీ ఏడుగురు సీనియర్లతో ఓ కమిటీ వేసింది. ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి నేతృత్వంలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, సీఎల్పీ నేత భట్టివిక్రమార్క, వర్కింగ్ ప్రెసిడెంట్లు రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కుసుమ కుమార్, అజారుద్దీన్​లను సభ్యులుగా నియమించింది.

జీవన్ రెడ్డి కమిటీ.. రెండు మండలి స్థానాలకు ఆశావహులను పరిశీలించి ఎంపిక చేసిన పేర్లను అధిష్ఠానానికి సిఫార్సు చేస్తుందని పీసీసీ పేర్కొంది. ఈ కమిటీ సిఫార్సు ఆధారంగానే కాంగ్రెస్ అధిష్ఠానం అభ్యర్థుల ఎంపికపై తుది నిర్ణయం తీసుకుంటుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ABOUT THE AUTHOR

...view details