తెలంగాణ

telangana

By

Published : Aug 29, 2020, 8:57 PM IST

ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్ @9pm

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

topten news @9pm
టాప్​టెన్ న్యూస్ @9pm

1. ప్రధాని శుభాకాంక్షలు..

తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు సాహిత్యంలో గిడుగు రామ్మూర్తి చెరగని ముద్ర వేశారని కీర్తించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

2. కొత్త పుస్తకాలు..

ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరంలో సవరించిన సిలబస్​తో కూడిన కొత్త పుస్తకాలను విడుదల చేశారు. ప్రతీ ఐదేళ్లకోసారి సిలబస్ మార్పులు చేస్తామని.. అందులో భాగంగానే సవరించినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

3. 4 కోట్లకు పైగా..

దేశంలో కరోనా పరీక్షల సంఖ్య 4 కోట్ల మార్కును దాటింది. దేశవ్యాప్తంగా రోజుకు 9 లక్షలకు పైగా నమూనాలు పరీక్షిస్తున్న నేపథ్యంలో ఈ మైలురాయిని అందుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

4. కరోనా పంజా..

దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తోంది. కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తమిళనాడులో తాజాగా ​6,352 కేసులు నమోదయ్యాయి. యూపీలో 5,684, కర్ణాటకలో 8,324 మంది కరోనా బారినపడ్డట్లు తేలింది. గుజరాత్​లో రికార్డు స్థాయిలో కేసులు బయటపడ్డాయి. మహారాష్ట్రలో కరోనా మరణాల సంఖ్య 24 వేలు దాటింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

5. ప్రపంచం అతలాకుతలం

అంతర్జాతీయంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. అమెరికా, బ్రెజిల్ దేశాల్లో మహమ్మారి తీవ్ర ప్రభావం చూపుతోంది. మొత్తం కేసుల సంఖ్య రెండున్నర కోట్లకు చేరువలో ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

6. శామ్​సంగ్​దే..

స్మార్ట్‌ఫోన్ల తయారీ దిగ్గజం శాం​సంగ్​... ఇండియన్​ ప్రీమియం స్మార్ట్​ఫోన్​ మార్కెట్​లో దుమ్ములేపుతోంది. చైనా సంస్థల నుంచి పోటీ ఎదుర్కొంటూనే అగ్రస్థానం సొంతం చేసుకున్నట్లు ఓ నివేదిక వెల్లడించింది. ఇక సూపర్​-ప్రీమియం విభాగంలో యాపిల్​ తన ఆధిపత్యం ప్రదర్శించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

7. అందుకే రైనా వెనక్కి..

ఐపీఎల్​ నుంచి అర్థంతరంగా రైనా తప్పుకోవడానికి కారణం, ఆయన బంధువు ఒకరు దుండగుల దాడిలో చనిపోవడమే కారణమని తెలుస్తోంది. ఈ విషయమై పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

8. ఐపీఎల్-అన్ అకాడమీ

'అన్​అకాడమీ'.. రానున్న మూడేళ్ల కాలానికి ఐపీఎల్ అధికారిక భాగస్వామిగా ఉండనుంది. ఈ విషయమై ఆనందం వ్యక్తం చేశారు సంస్థ వైస్ ప్రెసిడెంట్ కరణ్ ష్రాఫ్. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

9. ఆచార్యకు అన్నీ అడ్డంకులే..

సెప్టెంబరులో మొదలు కావాల్సిన చిరంజీవి 'ఆచార్య' చిత్రీకరణ వాయిదా పడే అవకాశముంది. హైదరాబాద్​లో కరోనా కేసుల పెరుగుతుండడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

10. నాన్న కోలుకుంటున్నారు

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలు ఆరోగ్యం నిలకడగానే ఉందని, నెమ్మదిగా కోలుకుంటున్నారని ఆయన తనయుడు ఎస్పీ చరణ్ చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details