తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​@ 9PM

ఇప్పటి వరకున్న ప్రధాన వార్తలు...

By

Published : Sep 20, 2020, 8:57 PM IST

top ten news@ 9PM
top ten news@ 9PM

మంచి రోజులొచ్చాయ్​...

వ్యవసాయ బిల్లుల ఆమోదంతో రైతులకు మంచి రోజులు రాబోతున్నాయన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. భారతదేశ వ్యవసాయ రంగంలో ఇదో చారిత్రక సందర్భంగా అభివర్ణించారు. రైతుల ఆదాయం రెట్టింపునకు ఈ బిల్లులు ఉపకరిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. కనీస మద్దతు ధర, పంట ఉత్పత్తి సేకరణ కొనసాగుతుందని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

హరివంశ్​​పై అవిశ్వాసం...

రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్​ హరివంశ్​ నారాయణ్​ సింగ్​పై 12 విపక్ష పార్టీలు కలిసి అవిశ్వాస తీర్మానం పెట్టాయి. వ్యవసాయ బిల్లులపై చర్చ సందర్భంగా రూల్​ బుక్​కు వ్యతిరేకంగా కొన్ని అంశాలు ఉన్నట్లు విపక్ష పార్టీలు అభ్యంతరం తెలిపాయి. అయినా వాటన్నింటిని బేఖాతరు చేస్తూ చర్చ కొనసాగించారని.. హరివంశ్​ వ్యవహారశైలిని తప్పుబట్టాయి.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఎప్పుడూ ఇలా జరగలేదు...

రాజ్యసభలో వ్యవసాయ బిల్లల ఆమోదం నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని తెరాస ఎంపీలు ఆరోపించారు. కేంద్రానికి డిప్యూటీ ఛైర్మన్​ పూర్తి పక్షపాతంగా వ్యవహరించటాన్ని ఖండించిన ఎంపీలు... అవిశ్వాస తీర్మానం పెట్టినా సభ అధ్యక్షుడి హోదాలో ఎలా కొనసాగుతారని ప్రశ్నించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

భయం... భయం...

కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌ మండలం కడంబా అటవీప్రాంతంలో శనివారం రాత్రి జరిగిన ఎన్‌కౌంటర్​లో మృతిచెందిన మావోయిస్టుల్లో ఒకరిని పోలీసులు గుర్తించారు. మరొక మావోయిస్టు వివరాల కోసం ఆరాతీస్తున్నారు. మరోపక్క తప్పించుకున్న మావోయిస్టు కీలక నేత మైలారపు అడెల్లు అలియాస్‌ భాస్కర్‌ కోసం ముమ్మర కూంబింగ్‌ జరుగుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

చాలా రోజుల తర్వాత...

యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహ స్వామి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం కావడం వల్ల భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కరోనా కాలంలో చాలా రోజుల తర్వాత ఆలయంలో సందడి నెలకొంది. మరో వైపు భక్తులు పలుచోట్లు భౌతిక దూరం పాటించడం లేదు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఇంకో మూడు రోజులు...

ఈశాన్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఈరోజు ఉదయం 5.30 గంటలకు అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. అల్పపీడనం ప్రభావంతో రాగల మూడు రోజుల వరకు ఉరుములు మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వివరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

54 లక్షలు దాటింది...

దేశంలో కరోనా విస్తృతి వేగంగా సాగుతోంది. కొత్తగా 92,605 కేసులు నమోదయ్యాయి. మరో 1133 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో భారత్​లో మొత్తం కేసుల సంఖ్య 54 లక్షలకు చేరింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10 రోజుల్లో టీవీల రెట్లు...

దేశీయ తయారీని ప్రోత్సహించేందుకు.. టీవీ ఓపెన్​ సెల్​ ప్యానెళ్లపై 5 శాతం దిగుమతి సుంకాన్ని మళ్లీ విధించనున్నట్లు ఆర్థిక శాఖ తెలిపింది. అక్టోబర్​ 1 నుంచి ఇది అమల్లోకి రానున్నట్లు స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో టీవీల ధరలు పెరిగే అవకాశం ఉందని సంకేతాలిచ్చాయి టెలివిజన్​ పరిశ్రమ వర్గాలు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఐపీఎల్​లో సరికొత్త రికార్డు...

కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ఐపీఎల్​లో సరికొత్త రికార్డు సృష్టించింది. లీగ్​ చరిత్రలోనే అత్యధిక సారథులు కలిగిన జట్టుగా ఘనత సాధించింది.​ పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఆ బుడ్డోడు ఎవరబ్బా...

కథానాయకుడు విజయ్ దేవరకొండ చేసిన ట్వీట్​.. అభిమానుల్ని అయోమయంలో పడేసింది. ఆ ఫారిన్ పిల్లాడ్ ఎవరా? అంటూ గుసగుసలాడుకుంటున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details