తెలంగాణ

telangana

ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్@ 7PM

ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తల సమాహారం మీకోసం.

By

Published : Jun 12, 2020, 6:58 PM IST

top ten-news
టాప్​టెన్ న్యూస్@ 7PM

కొండపోచమ్మ చెంతకు సీఎం కేసీఆర్​

సిద్దిపేట జిల్లా మర్కుక్‌లో కొండపోచమ్మ సాగర్ జలాశయాన్ని సీఎం కేసీఆర్ పరిశీలించారు. ఆకస్మికంగా ఆయన రిజర్వాయర్ వద్దకు చేరుకున్నారు. ఆకస్మికంగా ఎందుకు వెళ్లారంటే..

తుది దశలో..

ఇంటర్మీడియట్ మొదటి, రెండో సంవత్సరం పరీక్షల ఫలితాలు ఒకేసారి ప్రకటించేందుకు ఇంటర్ బోర్డు కసరత్తు చేస్తోంది. ఫలితాల నమోదు ప్రక్రియ తుది దశకు చేరింది. ఫలితాలు ఎప్పుడు ప్రకటిస్తారంటే...

ఈ దుస్థితికి పరిష్కారమెప్పుడు

అయిన వారికి కరోనా సోకిందన్న బాధ... వారి భవిష్యత్​ ఏంటోనన్న ఆందోళన... అయినా సమయానికి ఆస్పత్రిలో చేర్చి, వైద్యం అందించలేని దుస్థితి. ఇందుకు కారణం పేదరికమో, రోగుల్ని తీసుకెళ్లేందుకు సరైన రవాణా సౌకర్యాలు లేకపోవడమో కాదు. ఆస్పత్రుల్లో బెడ్ల కొరత వల్లే ఈ దుస్థితి. అది కూడా దేశ రాజధాని దిల్లీలో. ఎందుకిలా?

అన్​లాక్​ 1.0 పై క్లారిటీ

కరోనా లాక్​డౌన్ 'అన్​లాక్​ 1.0'లో భాగంగా రాత్రి పూట కర్ఫ్యూను కట్టుదిట్టంగా అమలు చేయాలని అన్ని రాష్ట్రాలకు స్పష్టంచేసింది కేంద్రం. సరకు రవాణా, బస్సుల రాకపోకలకు మాత్రం ఇబ్బంది రాకుండా చూడాలని సూచించింది.నిబంధనలు ఇలా ఉన్నాయి.

బాలికలదే హవా

ఏపీ ఇంటర్​ ఫలితాలను ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్​, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్‌ ​ విడుదల చేశారు. కరోనా వైరస్‌ విజృంభణ నేపథ్యంలో ప్రభుత్వం ఈసారి ఫలితాలను ఆన్‌లైన్‌లోనే విడుదల చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

గూగుల్​ దారి చూపుతుంది

కొవిడ్​-19 కు సంబంధించి గూగుల్​లో మరో కొత్త ఫీచర్​ అందుబాటులోకి వచ్చింది. కరోనా వైరస్​కు సంబంధించి గూగుల్​లో వెతికితే.. టెస్టింగ్​ ల్యాబ్​ల సమాచారం కూడా కనిపించనుంది.ఫీచర్​ విశేషాలు ఇలా ఉన్నాయి.

టీ తాగి బతికేస్తున్నాడు

మానవుని ప్రాథమిక అవసరాల్లో ఆహారం ఒకటి. ఒక్కపూట తినకపోతేనే.. రెండో పూట కాస్త తొందరగా తినేలా ప్రణాళికలేసుకుంటాం. అలాంటిది భోజనమే మానేసి.. 'టీ'తో 16 ఏళ్లుగా అద్భుతంగా జీవిస్తున్నాడో వ్యక్తి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజం! అతనెవరో తెలుసుకోవాలని ఉందా...

అతడే అంబానీ చాణక్యుడు

కరోనా లాక్​డౌన్​ భయాలతో స్టాక్‌ మార్కెట్లు నేలను చూస్తుంటే.. రిలయన్స్​ షేర్​ మాత్రం దూసుకెళ్తోంది. ఇంత ఆర్థిక సంక్షోభంలోనూ వరుస డీల్స్​తో కంపెనీ విలువ రాకెట్‌లా దూసుకుపోయింది. ఈ డీల్స్‌ వెనుక ముకేశ్‌ అంబానీ రైట్‌ హ్యాండ్‌గా పేరున్న ఓ వ్యక్తి మేథస్సు ఉంది. ఆయనెవరో తెలుసా..

ఆ సత్తా హిట్​మెన్​​కు ఉంది

పొట్టి ఫార్మాట్​లో డబుల్​ సెంచరీ చేయడం ఎంతో దూరంలో లేనట్లు కనిపిస్తుంది. అయితే ఈ స్కోరు చేయగల సమర్ధవంతమైన బ్యాట్స్​మెన్​ ఎవరనేది ప్రతి ఒక్కరిలో ఆసక్తిరేకెత్తిస్తోన్న ప్రశ్న. దీనిపై భారత మాజీ క్రికెటర్​ మహ్మద్​ కైఫ్​ స్పందించాడు. టీ20ల్లో డబుల్​ సెంచరీ చేయగల సత్తా ఎవరికి ఉందన్నాడంటే...

సందడి షురూ

లాక్​డౌన్​తో రెండున్నర నెలలుగా మూతపడిన సినీ, టెలివిజన్ పరిశ్రమలకు తెలంగాణ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఉత్తర్వులతో ఊరట లభించింది. సగం పూర్తయిన సినిమాలు, అర్ధాంతరంగా నిలిచిపోయిన టెలివిజన్ ధారావాహికలు చిత్రీకరణ చేసుకోవచ్చన్న అనుమతుల మేరకు ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్​సిటీలో చిత్రీకరణల సందడి మొదలైంది. ఆ విశేషాలేమిటో మీరూ చూడండి.

ABOUT THE AUTHOR

...view details