తెలంగాణ

telangana

By

Published : Jul 11, 2021, 12:59 PM IST

ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @1PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

టాప్​టెన్​ న్యూస్​ @1PM
టాప్​టెన్​ న్యూస్​ @1PM

  • బోనమెత్తిన భాగ్యనగరం..

ఊరూవాడా అంతా కలిసి సంబురంగా జరుపుకునే బోనాల పండుగు ఇవాళే షురూ అయింది. ప్రతిఏడులాగే ఈ ఏడు ఈ ఉత్సవాలు గోల్కొండ జగదాంబిక ఆలయంలో ప్రారంభమయ్యాయి. భక్తులు.. జగదాంబిక అమ్మవారికి తొలి బోనాన్ని సమర్పించారు. కరోనా నిబంధనలు పాటించేలా చూస్తూ.. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • రాష్ట్రంలో జోరు వాన..

రాష్ట్రంలో జోరు వానలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో కురిసిన తొలకరి జల్లులతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అల్పపీడన ద్రోణి ప్రభావంతో మరో మూడు రోజుల పాటు మోస్తరు వాన కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • చిరు జల్లులో అధికారులు..

పచ్చని అటవీ ప్రాంతంలో... వాన చినుకులు కురుస్తున్న వేళ వావ్ ఎంత బాగుంటుందో కదా. ఆ ప్రకృతి అందాలకు సీనియర్ సివిల్ సర్వీస్ మహిళా అధికారులు స్మితా సబర్వాల్, క్రిస్టినా, ప్రియాంక వర్గీస్ ముగ్ధులయ్యారు. అందుకే ఆ చిరుజల్లుల్లో తడిసి మురిసిపోయారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఆ దారిలో ప్రయాణం.. ఆహ్లాదకరం..

హరితహారంలో భాగంగా నాటిన మొక్కలతో హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై పచ్చదనం తాండవిస్తోంది. రహదారికి ఇరువైపులా కనువిందు చేస్తున్న వృక్షాలు.. ప్రయాణికులకు ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పిస్తున్నాయి. మరోవైపు కొన్నిచోట్ల మెుక్కల పెంపకం సరిగా నిర్వహించడం లేదనే విమర్శలూ వినిపిస్తున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • అంత్యక్రియలకు ఏర్పాట్లు..

రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ చనిపోయిన కత్తి మహేశ్​ అంత్యక్రియలు నేడు జరగనున్నాయి. ఏపీలో చిత్తూరు జిల్లాలోని ఆయన స్వగ్రామం యర్రావారిపాలెంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • భారత కాన్సులేట్‌ మూసివేత!

అఫ్గానిస్థాన్‌లోని కాందహార్​ నుంచి 50 మంది దౌత్యవేత్తలు, ఐటీబీపీ భద్రతా సిబ్బందిని భారత ప్రభుత్వం స్వదేశానికి తీసుకువచ్చింది. కాందహార్‌ చుట్టుపక్కల ప్రాంతాలపై తాలిబన్లు(Taliban) పట్టుబిగించిన నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి..

మధ్యప్రదేశ్​లో ఘోరం జరిగింది. కరెంట్​ షాక్​తో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు. ఛతర్​పుర్​ జిల్లాలోని బిజర్​వర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఒకసారి ఛార్జింగ్​.. 130 కి.మీ ప్రయాణం..

సరి కొత్త లుక్​లో, భవిష్యత్​ వాహనంగా రూపుదిద్దుకుంటున్న బీఎండబ్ల్యూ సీఈ04ను(BMW electric scooter ce04) ఆవిష్కరించింది బీఎండబ్ల్యూ మోటరాడ్. ఈ మోడల్​ ఫీచర్లు, విశేషాలు మీకోసం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • వింబుల్డన్​లో తొలిసారి..

వింబుల్డన్(Wimbledon) పురుషుల డబుల్స్​ టైటిల్​ను క్రొయేషియా జోడీ కైవసం చేసుకుంది. ఫైనల్లో నికోలా మెక్టిక్​-మేట్ పావిక్ జోడీ.. మార్సెల్​ గ్రానోల్లర్స్​(స్పెయిన్)-హోరాసియో జెబలోస్ల(అర్జెంటీనా) ద్వయంపై గెలుపొందింది.​ పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఆ హీరోలతో నాకేంటి?

జనానికి ఆయనొక సినిమా హీరో.. నిజానికి ఆయనో రైతుబిడ్డ. ఆయన మాట మాట్లాడితే అదొక విప్లవం. కానీ, ఆయన జీవన విధానం అతి సామాన్యం. ఆడంబరత అధికంగా కనిపించే సినిమా రంగంలో ఉంటూనే.. నిరాడంబరానికి ఆయన నిదర్శనంగా మారారు. ఆయన ఓ ఆదర్శ మూర్తి. ఆయన పేరు శ్రీ ఆర్​.నారాయణ మూర్తి(R. Narayana Murthy). ఈటీవీలో ప్రసారమవుతున్న 'చెప్పాలని ఉంది'(Cheppalani Vundi Etv) కార్యక్రమానికి అతిథిగా విచ్చేసి.. ఆయన వ్యక్తిగత, సినీ విశేషాలను చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details