తెలంగాణ

telangana

By

Published : Feb 25, 2022, 5:44 AM IST

ETV Bharat / city

Electricity charges : విద్యుత్ ఛార్జీల పెంపుపై నేడు ఈఆర్సీ బహిరంగ విచారణ

Electricity charges : విద్యుత్ ఛార్జీల పెంపుపై హైదరాబాద్ ఇవాళ ఈఆర్సీ బహిరంగ విచారణ జరపనుంది. ఈ విచారణలో వివిధ వర్గాల నుంచి వచ్చిన సూచనలు, సలహాలు, అభ్యంతరాలను పరిశీలించనున్న ఈఆర్సీ... ఛార్జీల పెంపుపై తుది నిర్ణయం తీసుకోనుంది.

The ERC public hearing on electricity tariffs hike today
The ERC public hearing on electricity tariffs hike today

Electricity charges : విద్యుత్ ఛార్జీల పెంపుపై హైదరాబాద్​లో ఇవాళ ఈఆర్సీ బహిరంగ విచారణ జరపనుంది. రెడ్​హిల్స్​లోని ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఫ్యాప్సి) బిల్డింగ్​లో విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనలపై రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ).. బహిరంగ విచారణ నిర్వహించనుంది.

2022-23లో విద్యుత్ ఛార్జీల పెంపునకు సంబంధించి రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు ఇటీవల ఈఆర్సీకి ఇప్పటికే ప్రతిపాదనలు సమర్పించాయి. నేటి బహిరంగ విచారణలో వివిధ వర్గాల నుంచి వచ్చిన సూచనలు, సలహాలు, అభ్యంతరాలను ఈఆర్సీ పరిశీలించి ఛార్జీల పెంపుపై తుది నిర్ణయం తీసుకోనుంది. ఏప్రిల్ 1 నుంచి నూతన విద్యుత్ ఛార్జీల పెంపు అమల్లోకి రానుంది.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details