తెలంగాణ

telangana

By

Published : Apr 22, 2022, 6:05 AM IST

ETV Bharat / city

ఉపాధ్యాయ పదోన్నతులకు పచ్చజెండా... వెబ్ కౌన్సిలింగ్ ద్వారా బదిలీలు..

Minister Sabitha Indra Reddy: ఉపాధ్యాయులకు వెబ్‌ కౌన్సెలింగ్‌ ద్వారా బదిలీలు చేపట్టి... తర్వాత పదోన్నతులు కల్పించాలని విద్యాశాఖ నిర్ణయించింది. అందుకు అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి పూర్తి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. పదోన్నతులపై ఆమె గురువారం తన కార్యాలయంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, కొన్ని ఉపాధ్యాయ సంఘాల నాయకులతో సమావేశమై చర్చించారు.

sabitha reddy
sabitha reddy

Minister Sabitha Indra Reddy: ఉపాధ్యాయులకు వెబ్‌ కౌన్సెలింగ్‌ ద్వారా బదిలీలు చేపట్టి... తర్వాత పదోన్నతులు కల్పించేందుకు అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి పూర్తి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. పదోన్నతులపై ఆమె గురువారం తన కార్యాలయంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, కొన్ని ఉపాధ్యాయ సంఘాల నాయకులతో సమావేశమై చర్చించారు. నూతన జిల్లాల సీనియారిటీ ప్రాతిపదికన... యాజమాన్యాల వారీగా హెచ్‌ఎంల స్థాయి వరకు బదిలీలు, పదోన్నతులు పూర్తిచేయాలని నిర్ణయించారు. ఎంఈవో, డిప్యూటీ ఈవో పదోన్నతులను మాత్రం ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం (జీటీఏ) నేతలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని మంత్రి చెప్పినట్లు తెలిసింది. సీఎం కేసీఆర్‌ హామీ మేరకు 5,571 ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయుల పోస్టులు మంజూరు చేసి ఎస్‌జీటీలకు పదోన్నతులిచ్చి భర్తీ చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. పరస్పర బదిలీల దస్త్రాన్ని సాధారణ పరిపాలనశాఖకు పంపామని, మూడు నాలుగు రోజుల్లో ఉత్తర్వులు వెలువడతాయని విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా చెప్పినట్లు సంఘాల నాయకులు తెలిపారు.

మరికొన్ని నిర్ణయాలు.. చర్చించిన అంశాలు..

* వచ్చే విద్యాసంవత్సరం (2022-23) ప్రవేశాలు ముగిసిన తర్వాతే ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ చేపడతారు.

* ఉపాధ్యాయులకు ప్రధాన అడ్డంకి భాషా పండితులు, పీఈటీ పోస్టుల ఉన్నతీకరణే అని,

* ఆ విషయం హైకోర్టులో ఉన్నందున దాన్ని త్వరగా ముగించాలని నిర్ణయించారు.

* మోడల్‌ పాఠశాలల ఉపాధ్యాయులకు తొమ్మిదేళ్లుగా పదోన్నతులు, బదిలీలు చేపట్టలేదని చర్చ సాగింది. ప్రస్తుత జోన్ల ప్రకారం ఆ ప్రక్రియలు పూర్తిచేయాలని నిర్ణయించారు.

* కేజీబీవీల్లో కాంట్రాక్టు సిబ్బంది బదిలీలు ఖాళీల మేరకు చేపడతామని మంత్రి హామీ ఇచ్చారు.

* మూతపడిన బడులకు విద్యార్థులు వచ్చేలా చర్యలు చేపట్టి ఆయా పాఠశాలలను పునఃప్రారంభించాలని నిర్ణయించారు.

ఈ సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా, పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన, ఎమ్మెల్సీలు కాటేపల్లి జనార్దన్‌రెడ్డి, కూర రఘోత్తంరెడ్డి, అలుగుబెల్లి నర్సిరెడ్డి, గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ వాణీదేవి, మాజీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పూల రవీందర్‌తోపాటు పీఆర్‌టీయూటీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్‌రావు, టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య, పీఆర్‌టీయూ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారెడ్డి అంజిరెడ్డి, టీపీటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మైసా శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:ఉద్యోగాల ప్రక్రియ వేగంగా పూర్తయ్యేలా... నియామక సంస్థల పరిశీలనలు

ABOUT THE AUTHOR

...view details